తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ది రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏడో వారంలోకి అడుగుపెట్టింది. అయితే దీనికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆరు వారాల్లో ఎప్పుడు జరగని విధంగా ఈ సారి నామినేషన్లు జరగుతున్నాయి.

బిగ్ బాస్ లో ప్రస్తుతం 13 మంది ఉన్నా.. లోబో సీక్రెట్ రూంలో ఉన్నాడు కాబట్టి ఇక 12 మంది మాత్రమే ఆట ఆడుతున్నారు. కంటెస్టెంట్ల సంఖ్య తగ్గుతున్నా కొలది ఆటలో కూడా మజా పెరిగిపోతోంది.ముగ్గురు వేటగాళ్ల చేతిలో నామినేషన్ ప్రక్రియను ఉంచినట్లు తెలుస్తోంది.
దీనిలో ప్రియాంక ఎంతో అగ్రెసివ్ గా కనిపిస్తుంది. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని చిందులు వేస్తుంది. అయితే నామినేషన్ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం 9 మంది ఉన్నట్లు లీకురాజాల ద్వారా తెలిసింది. ఇక ఈ వారం లోబో, శ్రీరామ్, ప్రియ, యానీ, రవి, పింకీ, కాజల్, జెస్సీ, సిరి నామినేట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది.
మొదటి నుంచి కూడా బిగ్ బాస్ నుంచి లీకులు వస్తూనే ఉన్నాయి. ఈ సారి కూడా ఇది నిజమైతదో .. లేదో తెలియాలంటే ఈ రోజు వచ్చే ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక 13 మందిలో ఆ 9 మంది నామినేట్ కాగా మిగిలిన వారు నామినేషన్లో లేరని తెలుస్తోంది.































