బిగ్ బాస్ సీజన్ 5 లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 10 వ వారం కాజల్ ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నా.. చివరిగా అనారోగ్యం కారణంగా జెస్సీ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. వారం పాటు సీక్రెట్ రూంలో ఉంచి అతడికి చికిత్స అందించారు బిగ్ బాస్ నిర్వాహకులు.

అయితే అతడి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో అతడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయి నాగార్జున దగ్గరకు వచ్చాడు. దీంతో అతడు హౌస్ మేట్స్ గురించి ఫోన్లో మాట్లాడాల్సి ఉంటుందని చెప్పగానే.. ప్రతీ ఒక్కరితో అతడు ఫోన్లో మాట్లాడాడు.
తప్పులు, ఒప్పుల గురించి మాట్లాడుతూ.. కొంతమందిని హెచ్చరించాడు కూడా. ముందుగా అతడు సన్నీకి ఫోన్ చేస్తాడు. నీ ఆట నువ్వు ఆడు ఎవరినీ నమ్మకు బ్రో అంటూ.. సలహా ఇస్తాడు. బీబీ హోటల్లో బాగా ఆడావు అంటూ కితాబిస్తాడు.
తర్వాత మానస్ తో కూడా.. తప్పుఒప్పుల గురించి మాట్లాడి.. విలువైన సలహాలు, సూచనలు ఇస్తాడు. ఇలా హౌస్ లో ఉన్న 9 మందితో మాట్లాడుతాడు. చివరగా షణ్ముఖ్ తో మాట్లాడిన అతడు.. కొంత భావోద్వేగానికి గురైనట్లు కనిపించింది. అతడు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే.. టాప్ లో ఉండే ఐదుగురు పేర్లను చెప్పేశాడు. సిరి, షణ్ముఖ్, రవి, శ్రీరామ్ అండ్ సన్నీ అంటూ చెప్పకనే చెప్పేశాడు. ఇక చివరగా హౌస్ వదిలి వెళ్లేముందు అతడు ఎంతో బాధపడుతూ నాగార్జునకు హగ్ ఇచ్చి.. హౌస్ మేట్స్ కు బై చెప్పేసి వెళ్తాడు.




























