రోజులు గడుస్తున్నా కొద్ది హౌస్ లో ఉత్కంఠ సాగుతోంది. ఎవరు ఎవరిపై విరుచుపడతారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. 19 మందితో మొదలైన ఈ బిగ్ బాస్ జర్నీ ప్రస్తుతం 9 మందితో కొనసాగుతోంది. ఇందులో ఇప్పటికే రవి మినహా మిగిలిన 8 మంది నామినేషన్లోకి వచ్చేశారు.
ఇందులో ఎక్కువగా వీక్ గా కనిపిస్తుంది కాజల్, యానీ మాస్టార్ మరియు ప్రియాంక. వీళ్లల్లో ఒకరు ఎలిమినేషన్ అనేది ఉంటుందనేది నెజిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే 10 వ వారం ఎలిమినేషన్ లేకుండా.. అనారోగ్యంతో ఉన్న జెస్సీని ఇంటి నుంచి బయటకు పంపించిన విషయం తెలిసిందే. అయితే అతడు వెళ్లిపోయి మానస్ లేదా కాజల్ ల్లో ఒకరికి లైఫ్ ఇచ్చి వెళ్లాడు.
దానికి అతడిని ప్రశంసిస్తున్నారు. అతడు విజయవాడకు చెందిన వ్యక్తి. మోడల్ గా సుప్రసిద్ధుడు. అటు మోడల్ గా, యాక్టర్ గా రాణిస్తున్నాడు. బిగ్ బాస్ లో అతడు 8వ కంటెస్టెంట్ గా అడుగు పెట్టి.. ఓ టాస్క్ లో ఒకరి చేయి అతడి మెడపై పడటంతో తీవ్ర నొప్పి రావడంతో దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ రోజు నుంచే అతడు అనార్యోగ్యానికి గురయ్యాడు.
బయటకు వచ్చే ముందు అతడి హౌస్ లో స్నేహితులు అయిన షణ్ముఖ్, సిరి భావోద్వేగానికి గురయ్యారు. బిగ్బాస్ నుంచి వైదొలగడం బాధగా ఉందని అతడు బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇదిలా ఉండగా.. జశ్వంత్ వర్టెగో తో బాధపుడుతున్నాడు. కావునా.. అతడిని కాచిగూడలోని టీఎక్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు తెలిపాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…