టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య డైవర్స్ విషయం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే చర్చ జరుగుతుంది. ఆల్మోస్ట్ డైవర్స్ కన్ఫమ్ అంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తన గురించి వస్తున్న వార్తలన్ని రూమర్లే నటి సమంత చెప్పడంతో వీరు విడాకులు తీసుకోలేదని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

తాజాగా వీరి విడాకుల విషయం గురించి నాగచైతన్య ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజుల నుంచి మా మధ్య వస్తున్న విడాకుల విషయంలో ప్రతీ ఒక్క మీడియా ప్రతినిధులు వివిధ రకాల వార్తలను ప్రచురించారు. ఏమాయ చేసావే సినిమాతో కలిసిన మా స్నేహ బంధం దాదాపు 10 సంవత్సరాల వరకు సాగిందని..దానిని 4 సంవత్సరాల క్రితం పెళ్లితో ముడివేశామని చెప్పాడు.

ఇక నుంచి తాము వేరే దారులను చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. దానికి సంబంధించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఇటువంటి సందర్బంలో తమకు మీడియా సపోర్ట్ గా ఉండాలంటూ వేడుకున్నాడు. ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని.. ఈ క్లిష్ట సమయంలో తన వెంట ఉండాలని ఆయన అభిమానుల్ని కోరారు.

సమంత నాగచైతన్య విషయంలో వచ్చిన పుకార్లు అన్నీ నిజం అయ్యాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అటువంటి నిర్ణయం కరెక్ట్ కాదంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఏదిఏమైనా నాగచైతన్య ఈ విధంగా విడాకుల విషయం తెలియజేయడంతో అభిమానులకు మింగుడు పడలేదని చెప్పవచ్చు.































