Pushpa 2 : పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలకు పెద్ద ఎత్తున సిద్ధమైంది. ఈ సందర్భంగా ఏపీ తెలంగాణలో ముందు రోజు అంటే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 గంటలకు ప్రత్యేక వేసేందుకు అనుమతి లభించింది. రెండు రాష్ట్రాల్లోనూ ముందు రోజే బెనిఫిట్ షో పడుతుంది. ఇప్పటికే ట్విట్టర్ రివ్యూలు వచ్చేసాయి, ఇంట్రడక్షన్ సీన్ ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్స్ కి ఓ రేంజ్ లో విజిల్స్ పడతాయి అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన ప్రపంచం లో ఉన్నారు సినీ ప్రేమికులు. అయితే ఈ సినిమా ముందు నుంచి ఏదో ఒక ట్రోల్ కి గురవుతూనే ఉంది.
ఎంతోమంది ఈ సినిమాపై విమర్శలు కూడా చేశారు. టికెట్ల రేట్లు పెంచేశారని కొందరు అసహనం వ్యక్తం చేస్తూ ఉంటే మరొకరు ఈ సినిమాలలో డాన్సులు మరి దారుణంగా ఉన్నాయి అంటూ ట్రోన్స్ చేస్తున్నారు. పలువురు ఈ సినిమాపై కేసు వేసిన విషయం కూడా తెలిసిందే అయితే తాజాగా ఈ సినిమా ఒక బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు ఆయనే ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పుష్ప సినిమాలో చూపించిందంతా అబద్ధం. ఎర్రచందనం లక్ష రూపాయలు ఉంటే కోటి రూపాయలు లాగా చూపిస్తున్నారు.
దీంతో చాలామంది ఆ చెట్లను నరుకుతున్నారు, పుష్ప వన్ సమయంలో కూడా చాలామంది ఆ చెట్లని నరికేశారు, ఇప్పుడు ఇంకెన్ని నరికేస్తారో అంటూ ఫైర్ అయ్యారు. వెంటనే అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ లని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సినిమాతో యువత పాడైపోతున్నట్లు చెప్పారు సమాజాన్ని చెడగొట్టే పుష్ప 2 సినిమాను రిలీజ్ కూడా చేయవద్దని డిమాండ్ చేశారు.
అయితే అతని వాదన సరి అయింది కాదు అంటూ అతనిపై ఫైర్ అవుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఈ సినిమా మొదటి పార్ట్ విడుదలైనప్పుడు కూడా సినిమాపై చాలా విమర్శలు వచ్చాయి కానీ పని అడ్డంకులు దాటుకొని ఆఖండ విజయాన్ని సాధించింది పుష్ప వన్. ఇప్పుడు పుష్ప 2 సినిమా కూడా అలాగే అన్ని విమర్శలని అన్ని అడ్డంకులని దాటుకొని పెద్ద హిట్ అవుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…