General News

సలార్ ఫ్లాష్ బ్యాక్ లో మెరవనున్న… బాలీవుడ్ తారలు?

కన్నడ నటుడు యష్ హీరోగా తెరకెక్కిన కేజిఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా దర్శకుడు టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీని మొత్తం తన వైపు తిప్పుకున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ తో సినిమా చేయనున్నారని ప్రకటించారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా, పాన్ ఇండియా చిత్రంగా ప్రశాంత్ నీల్ “సలార్” అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆ తరువాత కరోనా కారణం వల్ల వాయిదా పడింది. అయితే ఈ సమయంలో దర్శకుడు ఈ సినిమా కథలో భారీగా మార్పులు చేశారని తెలుస్తోంది.

మొదటిగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందనే విషయాన్ని చెప్పినప్పటికీ, కరోనా సమయంలో ఈ ఫ్లాష్ బ్యాక్ ను చాలా హైలెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలీవుడ్ తారలు నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే వారు ఎవరు? ఏమిటి? అనే విషయాలను చిత్రబృందం తెలియజేయాల్సి ఉంది.

ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ చిత్రీకరణలో పాల్గొననున్నట్లు ఈ సందర్భంగా చిత్రబృందం తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago