కన్నడ నటుడు యష్ హీరోగా తెరకెక్కిన కేజిఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా దర్శకుడు టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీని మొత్తం తన వైపు తిప్పుకున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ తో సినిమా చేయనున్నారని ప్రకటించారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా, పాన్ ఇండియా చిత్రంగా ప్రశాంత్ నీల్ “సలార్” అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆ తరువాత కరోనా కారణం వల్ల వాయిదా పడింది. అయితే ఈ సమయంలో దర్శకుడు ఈ సినిమా కథలో భారీగా మార్పులు చేశారని తెలుస్తోంది.
మొదటిగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందనే విషయాన్ని చెప్పినప్పటికీ, కరోనా సమయంలో ఈ ఫ్లాష్ బ్యాక్ ను చాలా హైలెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలీవుడ్ తారలు నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే వారు ఎవరు? ఏమిటి? అనే విషయాలను చిత్రబృందం తెలియజేయాల్సి ఉంది.
ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ చిత్రీకరణలో పాల్గొననున్నట్లు ఈ సందర్భంగా చిత్రబృందం తెలిపారు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…