కన్నడ నటుడు యష్ హీరోగా తెరకెక్కిన కేజిఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా దర్శకుడు టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీని మొత్తం తన వైపు తిప్పుకున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ తో సినిమా చేయనున్నారని ప్రకటించారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా, పాన్ ఇండియా చిత్రంగా ప్రశాంత్ నీల్ “సలార్” అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆ తరువాత కరోనా కారణం వల్ల వాయిదా పడింది. అయితే ఈ సమయంలో దర్శకుడు ఈ సినిమా కథలో భారీగా మార్పులు చేశారని తెలుస్తోంది.
మొదటిగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందనే విషయాన్ని చెప్పినప్పటికీ, కరోనా సమయంలో ఈ ఫ్లాష్ బ్యాక్ ను చాలా హైలెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలీవుడ్ తారలు నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే వారు ఎవరు? ఏమిటి? అనే విషయాలను చిత్రబృందం తెలియజేయాల్సి ఉంది.
ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ చిత్రీకరణలో పాల్గొననున్నట్లు ఈ సందర్భంగా చిత్రబృందం తెలిపారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…