టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కొందరుస్టార్ డైరక్టర్స్ తమ సినిమాకు రిచ్ లుక్ అద్దేందుకు చిన్న పాత్రకు కూడా పెద్ద ఆర్టిస్ట్ లను తీసుకొస్తూంటారు. అప్పట్లో రాఘవేంద్రరావు ,ఈ కాలంలో త్రివిక్రమ్ దాన్ని ఫాలో అవుతున్నారు.అలా చేస్తే ఆ పాత్రకు వెయిటేజీ బాగా వస్తుందని, జనాల్లోకి స్పీడుగా వెళ్లిపోతుందని నమ్ముతారు.
త్రివిక్రమ్ సినిమాలను గమనిస్తే అది అర్దమవుతుంది. అత్తారింటికి దారేదీలో నదియా,’సన్నాఫ్ సత్యమూర్తి’లో స్నేహ, ‘అజ్ఞాతవాసి’ లో ఖుష్బూ.. ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో దేవయాని, అల వైకుంఠపురములో టబు, సుశాంత్ ఇలా ప్రతీ పాత్రకూ పేరున్నవాళ్లే కనిపించి మురిపిస్తారు. అందుకే త్రివిక్రమ్ సినిమా పోస్టర్ అనగానే భారీలుక్ వచ్చేస్తుంది. అందంగా కనిపిస్తుంటుంది.
ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ..ఇప్పుడు కూడా సేమ్ ఫార్ములా ఫాలో అవుతున్నాడు త్రివిక్రమ్. మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం ఆర్టిస్ట్ ల ఎంపికలో అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారదట. ఈనెల 31న లాంఛనంగా ప్రారంభం అయ్యే ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం.. శిల్పాశెట్టిని ఎంచుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.అలాగే మరో పాత్ర కోసం అక్కినేని సుమంత్ ని తీసుకోవాలని భావిస్తున్నార్ట.
ఇంక వీళ్లు చేసే క్యారక్టర్స్ విషయానికి వస్తే.. మహేష్ కి అత్తగా శిల్ప.. బావగా సుమంత్ కనిపించనున్నారని చెప్తున్నారు..మరి ఇందులో వాస్తవాలు ఎంతున్నాయో తెలియాలంటే వీటిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలే వరకు ఆగాల్సిందే.ఇక ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కరోనా వల్ల వాయిదా పడింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్…!!
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…