Borugadda Anil Kumar : తాజాగా ఏపీ రాజకీయాల్లో బాగా విమర్శలు చేస్తూ కోటంరెడ్డి విషయంలో వైరల్ అయిన రిపబ్లిక్ పార్టీ సభ్యుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఈసారి నిన్నటి వరకు జనసేన లో ఉన్న మహాసేన రాజేష్ మీద హాట్ కామెంట్స్ చేసాడు. అతనో రేపిస్ట్ అంటూ రెచ్చిపోయాడు. అతని గురించి అందరికీ తెలుసుని, ఆధారాలతో సహా కొద్ది రోజులు ఆగితే నిరూపిస్తాను అంటూ రాజేష్ కుటుంబాలను నాశనం చేశాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శించాడు బోరుగడ్డ అనిల్ కుమార్.

వాడొక 420, రేపిస్ట్.. కేసులున్నాయి…
బోరుగడ్డ అనిల్ కుమార్ మహాసేన రాజేష్ గురించి మాట్లాడుతూ వాడు టైలర్ గా ఉండేవాడు, ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించి సెక్సువల్ వీడియోలు చేసాడని, గతంలోనే కేసులు ఉన్నాయంటూ ఆరోపించాడు. ఇక మహాసేన రాజేష్ తన ఇంటి పక్కనే ఉన్న సత్యనారాయణ అలియాస్ జాన్సన్ అనే వ్యక్తి కుటుంబాన్ని నాశనం చేశాడంటూ చెప్పాడు అనిల్ కుమార్.

జాన్సన్ అనే వ్యక్తి దుబాయ్ వెళ్లి పనిచేసుకుంటూ ఉండగా భార్య ఇక్కడే ఉంది. అయితే జాన్సన్ భార్యని మహాసేన రాజేష్ ట్రాప్ చేసి న్యూడ్ ఫొటోస్, వీడియోస్ తీసి నెట్టింట్లో పేడతానని బెదిరించి ఆమెను లోబరుచుకున్నాడు. చివరికి దొంగ పాసుపోర్టు ఆమెకు మరో వ్యక్తికి సృష్టించి ఆమె భర్తగా అతడిని చిత్రీకరించి ఒమన్ లాంటి దేశానికి పంపించేసాడు. ఆ జాన్సన్ అనే వ్యక్తికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇలా తన భార్యను చేసిన మహాసేన రాజేష్ మీద ఫిర్యాదు కూడా చేసాడు. కొద్ది రోజులు ఉంటే పక్కా ఆధారాలతో అన్ని విషయాలను బయటికి తెస్తాను, ఆ రాజేష్ ఎలాంటి వాడో అందరికీ తెలుసు అంటూ ఫైర్ అయ్యాడు అనిల్ కుమార్.





























