గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ శివారులోని మంచిరేవుల పేకాట కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. అయితేహీరో నాగ సౌర్య తండ్రికి సంబంధించిన ఫాంహౌస్ లో వీరందరూ అరెస్టు కావడంతో ఈ కేసుకు నాగసౌర్య తండ్రికి ఏ విధమైనటువంటి సంబంధం ఉందా అంటూ పోలీసులు విచారణ జరిపారు.

ఈ విచారణలో భాగంగా క్యాసినో కింగ్పిన్ గుత్తా సుమన్తో కలసి నాగసౌర్య తండ్రిశివలింగ ప్రసాద్ పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఆధారాలను సేకరించడంతో వెంటనే పోలీసులు నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ ను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అతనిని ఉప్పర్పల్లి కోర్టుకు హాజరు పరచడంతో తన తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
నిన్నటి వరకు ఈ పేకాట దందాతో నాగశౌర్య తండ్రికి ఏమాత్రం సంబంధం లేదని కేవలం ఫాంహౌస్ మాత్రమే అతని పేరు పై ఉందని ఈ వ్యవహారంలో నాగశౌర్య బాబాయి ఉన్నారంటూ వార్తలు వినిపించినప్పటికీ పోలీసులు పలు కీలకమైన ఆధారాలు సేకరించడంతో ఈ పేకాట దందాలో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ పేరు బయటపడింది.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సుమారు ముప్పై మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఎక్కువగా హైదరాబాద్ వాసులు మాత్రమే కాకుండా నిజామాబాద్, విజయవాడ నుంచి బడాబాబులు అక్కడికి చేరుకొని పేకాట ఆడుతున్నట్లు పోలీసులు వారి విచారణలో వెల్లడించారు.































