తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ సిఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

మరోవైపు ఇక రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ కూడా అవసరం లేదనే భావనకు కేబినెట్ వచ్చింది. దీనితో అన్ని కార్యకలాపాలు యధావిధిగా జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో లాక్ డౌన్ సందర్బంగా విధించిన అన్ని రకాల నిబంధనలను ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినేట్ ఆదేశించింది. దీనిపై కాసేపట్లో మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది.































