Manchu Vishnu: ఆరు నెలలో మా బిల్డింగ్ భూమి పూజ.. మంచు విష్ణు కీలక ప్రకటన!
Manchu Vishnu: మంచు విష్ణు సినీనటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈయన మా అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. మంచు విష్ణు మా అధ్యక్షుడు అయిన తర్వాత ఎక్కువగా మా సభ్యుల ఆరోగ్యం గురించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మా సభ్యులకు ఉచితంగా హెల్త్ చెకప్ క్యాంపు నిర్వహించారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ లో మా సభ్యులందరూ ఉచితంగా చెకప్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే హాస్పిటల్ సేవలను కొనియాడారు. ఇకపోతే మా బిల్డింగ్ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు.
ఇప్పటివరకు మా అసోసియేషన్ కు బిల్డింగ్ లేదు. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో మంచు విష్ణు మా బిల్డింగ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అది కూడా తన సొంత డబ్బులతో మా బిల్డింగ్ నిర్మిస్తానని చెప్పినప్పటికీ ఇప్పటివరకు మా బిల్డింగ్ ఏ మాత్రం కార్యరూపం దాల్చలేదు.తాజాగా మా బిల్లింగ్ గురించి మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు.
మరో ఆరు నెలలు మా బిల్డింగ్ పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంచు విష్ణు తెలిపారు.తాను అధ్యక్షుడిగా ఎన్నికైన ఆరు నెలలలో 75 శాతం తన మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను పూర్తి చేశానని మరోఆరునెలలు మా బిల్డింగ్ పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంటుందని వెల్లడించారు. ఇక ఈ సమావేశంలో భాగంగా సినిమా టికెట్ల రేట్లు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. సినిమా టికెట్ల రేట్లు ఒక్కరే తీసుకోవలసిన నిర్ణయం కాదు. ఈ విషయంపై అందరూ కలిసి కూర్చొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని విష్ణు వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…