Category Archives: Featured

Featured posts

Nag Aswin: నాగ్ అశ్విన్ కి ఆ హీరోయిన్ అంటే అంత సెంటిమెంట్ నా.. ఆమె ఉంటే హిట్ గ్యారెంటీ?

Nag Aswin: సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా కొనసాగుతున్న నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దర్శకుడిగా కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస అప్డేట్స్ విడుదల చేయడమే కాకుండా వరుస ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నారు.

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు హిట్ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందని తద్వారా ఈ సినిమా కూడా హిట్ అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ నాగార్జునకు ఒక హీరోయిన్ అలాగే ఒక హీరో హిట్ సెంటిమెంట్ గా మారారని అందుకే తన సినిమాలలో వీరిద్దరిని కచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది.

నాగ్ అశ్విన్ సినిమా చేస్తున్నారంటే తప్పనిసరిగా విజయ్ దేవరకొండ మాళవిక నాయర్ వీరిద్దరూ ఉండేలా ఈయన జాగ్రత్త పడుతున్నారట. నాగ్ అశ్విన్ చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి కల్కి ఈ మూడు సినిమాలలో వీరిద్దరూ నటించారు నటించిన ఇదివరకు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి అందుకే ఈ కల్కి సినిమాలో కూడా విజయ్ దేవరకొండతో పాటు మాళవిక నాయర్ ఉండేలా అశ్విన్ జాగ్రత్త పడ్డారు.

విజయ్ దేవరకొండ.. మాళవిక నాయర్..
ఈ హిట్ సెంటిమెంట్ ప్రకారం ఈయన కల్కి సినిమా ద్వారా మరో సక్సెస్ అందుకోబోతున్నారంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటివరకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు కానీ ఈ సినిమాకు మాత్రం ఫ్రీ బుకింగ్స్ భారీగా జరగడంతో సినిమాపై కూడా అంచనాలు అలాగే ఉన్నాయి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్షలో పవన్ … అందుకే దీక్ష వేశారా?

Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎన్నో బాధ్యతలను తీసుకొని పెద్ద ఎత్తున అధికారులతో సమావేశాలు సమీక్షలను నిర్వహిస్తూ అన్ని శాఖలపై ఆరా తీయడమే కాకుండా అధికారులకు సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ తరచూ ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా ప్రజా సమస్యలను క్షణాలలోని పరిష్కరిస్తూ ఉన్నారు. ఇలా రాజకీయాల పరంగా ఎంతో బిజీగా అయిన పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి అమ్మవారి దీక్ష వేశారు. 11 రోజులపాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలోనే ఉండబోతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష వేయడంతో ఈ దీక్ష గురించి పెద్ద ఎత్తున అందరూ తెలుసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టుకోవడమే కాకుండా గతంలో కూడా ఎన్నోసార్లు వారాహి అమ్మవారి పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇక ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను 11 రోజులపాటు వేయబోతున్నారు.

11 రోజుల దీక్ష..
ఈ 11 రోజులు పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకాకుండా కేవలం పండ్లు, ద్రవాలను మాత్రమే తీసుకోబోతున్నారు. అయితే ఈ విధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష వేయడానికి గల కారణం ఏంటనే విషయాన్ని వస్తే ఎన్నికలలో తన విజయం కోసమే ఈయన అమ్మవారికి మొక్కుకున్నారని అయితే ఎన్నికలలో విజయం సాధించడంతో అమ్మవారి మొక్కు తీర్చడం కోసం ఇలా దీక్ష వేశారని తెలుస్తోంది.

Puri Jagannadh: పూరి జగన్నాథ్ కు పోకిరి కంటే ఆ సినిమా డైలాగ్స్ అంటే అంత ఇష్టమా?

Puri Jagannadh: పూరి జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా ఈయన డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వాళ్ళే.

ఇక పూరి జగన్నాథ్ సినిమాలు చాలా భిన్నంగా ఉంటాయి ఈయన సినిమాలలో హీరోలకు ఇచ్చే ఎలివేషన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈయన సినిమాలలో హీరోలు అందరూ కూడా కాస్త పొగరుగా ఉండేలాగే చూపిస్తూ ఉంటారు. ఇక ఈయన సినిమాలలో డైలాగ్స్ కూడా భారీ స్థాయిలో పేలుతూ ఉంటాయి. ఇక ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈయన డైరెక్షన్ చేసిన సినిమాలలో పోకిరి సినిమా మరో లెవల్ అని చెప్పాలి.

ఈ సినిమాలో మహేష్ బాబు నటన ఆయన చెప్పిన డైలాగ్స్ భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇలా ఇంత మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమాలోని డైలాగ్స్ అంటే తనకు పెద్దగా ఇష్టం లేదని పూరి ఓ సందర్భంలో వెల్లడించారు. తనకు పోకిరి సినిమా కంటే బిజినెస్ మాన్ సినిమాలో డైలాగ్స్ అంటే చాలా ఇష్టమని ఈయన తెలిపారు.

బిజినెస్ మాన్..
ఈ సినిమాలో నన్ను కన్ఫ్యూజ్ చేయకండి కన్ఫ్యూజన్లో ఎక్కువగా కొట్టేస్తా అని చెప్పే డైలాగ్స్, ముంబైకి ఉచ్చ పోయించడానికి వచ్చా అంటూ డైలాగ్స్ బారి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అయితే ఈ సినిమాలో డైలాగ్స్ అంటేనే తనకు ఇష్టం అంటూ పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక పూరి విషయానికొస్తే ప్రస్తుతం ఈయన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Tollywood: గన్నవరం చేరుకున్న టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్.. పవన్ తో కీలక భేటీ?

Tollywood: టాలీవుడ్ కి సంబంధించిన పలువురు స్టార్ సెలబ్రిటీలందరూ కూడా ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. వీరంతా నేడు క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్ కలవబోతున్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో విజయవాడ క్యాంప్ ఆఫీసులో నిర్మాతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు.

ఈ విధంగా టాలీవుడ్ నిర్మాతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ని కలిసి సినిమా ఇండస్ట్రీలో ఎదురవుతున్న సమస్యలను వివరించబోతున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా ఏపీలో ప్రస్తుతం సినిమా టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి అలాగే స్పెషల్ షోస్ బెనిఫిట్ షోలకు కూడా పరిమితి లేదు. ఈ క్రమంలోనే ఈ అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

గత ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు భారీగా తగ్గించడమే కాకుండా బెనిఫిట్ షోలకు కూడా అనుమతి లేకుండా చేసింది. ఈ క్రమంలోనే ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చిత్రపరిశ్రమ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక నేడు చిత్ర పరిశ్రమపై ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసమే భేటీ కానున్నారని తెలుస్తోంది.

ఇండస్ట్రీ సమస్యలపై చర్చ..
ఇక ఈ భేటీలో భాగంగా ప్రముఖ నిర్మాతలైన దిల్ రాజు, అశ్వినీ దత్, అల్లు అరవింద్, నాగ వంశీ, యార్లగడ్డ సుప్రియ, టిజి విశ్వప్రసాద్, దగ్గుబాటి సురేష్ వంటి వారందరూ కూడా వెళ్లారని తెలుస్తోంది. మరొక మూడు రోజులలో అశ్వినీ దత్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్కి సినిమా విడుదల కాబోతుంది అయితే ఈ సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయంపై ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఈ భేటీ అనంతరం కల్కి సినిమా టికెట్ల విషయంలో కూడా క్లారిటీ రాబోతుందని తెలుస్తుంది.

AP Cabinet: మొదటిరోజు ప్రారంభమైన ఏపీ క్యాబినెట్.. మెగా డీఎస్సీకి ఆమోదం?

AP Cabinet: 164 సీట్లతో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమై అసెంబ్లీ సమావేశాలలో భాగంగా గెలిచిన వారందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు అయితే మొదటిసారి ఏపీ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రులందరూ కూడా హాజరయ్యారు. ఇక ఏపీ క్యాబినెట్ సమావేశంలో భాగంగా పలు విషయాలు చర్చకు వచ్చాయి ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారు. ఇక ఈ క్యాబినెట్ సమావేశంలో భాగంగా డీఎస్సీకి ఆమోదం తెలిపారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొత్తం 16,347 పోస్టులతో డీఎస్సీ నిర్వహించబోతున్నట్లు తెలియజేశారు. ఇక ఈ విషయంపై క్యాబినెట్లో చర్చలు కూడా జరిగాయి. ఇందుకు సంబంధించిన ప్రక్రియ జులై ఒకటి నుంచి ప్రారంభం కాబోతుందని డిసెంబర్ లోపు పోస్టులన్నింటిని భర్తీ చేయాలని క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది.

టెట్ నిర్వహణ..
ఇకపోతే గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పటికే చాలామంది టెట్ పరీక్షను కూడా రాశారు అయితే పరీక్ష ఫలితాలు ఇప్పటివరకు వెలబడలేదు ఈ క్రమంలోనే మరోసారి నిర్వహించాలని పలువురు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కోరగా ఆయన ఈ విషయంపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇలా మరోసారి టెట్ నిర్వహిస్తే మరి కొంతమంది నిరుద్యోగులకు డీఎస్సీ రాసే అవకాశం కూడా కలుగుతుందని భావిస్తున్నారు.

Nagarjuna: కొంచమైనా మానవత్వం ఉందా.. ట్రోల్స్ కి గురైన నాగార్జున.. క్షమాపణలు చెప్పిన హీరో!

Nagarjuna: సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక నాగార్జున తన సినిమాల వరకు తాను బిజీగా ఉంటారు తప్ప ఇతర విషయాల గురించి పెద్దగా కల్పించుకోరు. అంతేకాకుండా ఈయన సోషల్ మీడియాకి కూడా చాలా దూరంగా ఉంటారు.

ఇలా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే ఈయన అత్యవసరమైతే తప్ప ఆయా సంఘటనలపై స్పందించరు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా నాగార్జున భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఇలా ట్రోల్స్ కి గురి కావడంతో వెంటనే నాగార్జున క్షమాపణలు చెబుతూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

అసలు నాగార్జున క్షమాపణలు చెప్పడం ఏంటి? ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. నాగార్జున ఇటీవల ఎయిర్ పోర్ట్ లో కనిపించారు సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా కనిపిస్తే అభిమానులు వారితో సెల్ఫీ తీసుకోవడం కోసం వెళ్తారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని సెల్ఫీ తీసుకోవడం కోసం వెళ్లగా అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆయనని తోసేసారు దీంతో ఆ అభిమాని ఒక్కసారిగా కింద పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపై జరగవు.
ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నాగార్జున పై ట్రోల్ చేశారు. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో నాగార్జున స్పందించి క్లారిటీ ఇచ్చారు.. ఈ విషయం ఇప్పుడే నా దృష్టికి వచ్చింది అలా ఒక వ్యక్తిని తోయటం సరైంది కాదు ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నాను ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాము అంటూ నాగార్జున ఈ సందర్భంగా క్షమాపణలు చెబుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Ap Politics: అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఎంత ప్రమాదమో భవిష్యత్తులో తెలుస్తాయి: శ్రవణ్ కుమార్

Ap Politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై జై భీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్‌ కుమార్‌ స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసిపి పార్టీ కార్యాలయాలను కూల్చివేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఆయన రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని అని ప్రభుత్వ కార్యాలయాలను పడగొట్టడానికా కూటమికి అధికారం ఇచ్చిందని ప్రశ్నించారు.

ఏవైనా భవనాలను కూల్చాలనుకుంటే కోర్టు ఆర్డర్‌తో కూల్చండి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కరెక్ట్‌ కాదు. రూల్‌ ఆఫ్‌ లాను టీడీపీ ఉల్లంఘిస్తోంది. పార్టీ ఆఫీసులకు అనుమతి లేదని అధికారులకు ఇప్పుడు గుర్తొచ్చిందా.. అధికారులు ఏ ప్రభుత్వము అధికారంలో ఉంటే వారికి కొమ్ము కాయడం సరికాదని ఈయన తెలిపారు. కోర్టు అనుమతి లేకుండా ఏ బిల్డింగులను కూడా కూల్చి వేయకూడదు అంతేకాకుండా కరకట్టపై ఉన్న బిల్డింగులకు ఏ ఒక్క బిల్డింగ్ కైనా అనుమతి ఉందా అంటూ ఈయన ప్రశ్నించారు.

2029 ఎన్నికలలో తెలుస్తుంది..
కరకట్ట మీద ఉన్న బిల్డింగ్స్ పడగొట్టాలని కోర్టులో పిటిషన్‌ వేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులను కూడా ఈయన ఖండించారు. అంతేకాకుండా అచ్చం నాయుడు ఇటీవల అధికారుల గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై ఈయన స్పందించారు.అచ్చెన్నాయుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఎంత ప్రమాదకరమో 2029 ఎన్నికలో ఆయనకు తెలుస్తుంది. అధికారులను అరెస్ట్ చేయాలి. కలెక్టర్లను టార్గెట్ చేయాలి అనేవి మానుకోవాలి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేయాలి, తరిమేయాలని అనుకుంటే కుదరదు. ప్రజలు చూస్తూ ఊరుకోరు ప్రజల ఆలోచనలకు కూడా విలువ ఇవ్వాలంటూ ఈ సందర్భంగా జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

Kalki: ఏపీలో పెరిగిన కల్కి సినిమా టికెట్ల రేట్లు.. ఎంతంటే?

Kalki: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది జూన్ 27వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రాంతాలలో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి.

అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే టికెట్లు అన్నీ కూడా అమ్ముడుపోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక తెలంగాణలో కూడా ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ తెలంగాణ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇప్పటికే తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి ఇకపోతే ఏపీలో ఇప్పటివరకు టికెట్ల రేట్లపై ఎలాంటి స్పష్టత రాలేదు.

అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ కాలేదు అయితే నిన్న సినిమా నిర్మాతలు అందరూ కూడా డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ ని కలిసిన సంగతి మనకు తెలిసిందే. ఈ భేటీలో భాగంగా సినిమా టికెట్ల రేట్లు గురించి కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. అయితే కల్కి సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అదనపు షోలకు అనుమతి..
ఇక కల్కి సినిమా విడుదలైన తర్వాత సింగిల్ థియేటర్లలో 75 రూపాయలు మల్టీప్లెక్స్ లో 125 రూపాయలను రెండు వారాలు పాటు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది అంతేకాకుండా రోజుకు ఐదు షోలు వేసుకొనే అనుమతి కూడా తెలియజేయడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను కలిసిన తన ఫస్ట్ సినిమా హీరోయిన్.. ఫోటో వైరల్!

Pawan Kalyan: సినీ నటుడిగా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు రాజకీయాలలోకి అడుగుపెట్టారు. ప్రస్తుత రాజకీయ నాయకుడిగా ఏపీ రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఎంతో కీలకంగా మారారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రిగా పలు శాఖల బాధ్యతలను తీసుకొని ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలవడం కోసం టాలీవుడ్ సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకొని అనంతరం విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ ని కలిశారు.

ఇలా పలువురు టాలీవుడ్ ప్రొడ్యూసర్ తో పాటు లేడీ ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డ కూడా పవన్ కళ్యాణ్ ను కలిసారు. ఇలా వీరంతా పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అనంతరం చిత్ర పరిశ్రమపై ఉన్నటువంటి ఇబ్బందుల గురించి సమస్యల గురించి పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినవారు కావడంతో సమస్యల గురించి ఆయనకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి
ఇక ప్రస్తుత ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలిసి అనంతరం వారి సమస్యలను తెలియజేశారు.ఈ క్రమంలోనే సుప్రియ పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది కాస్త వైరల్ గా మారింది. వీరిద్దరూ కలిసి మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో నటించారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత సుప్రియ పెద్దగా సినిమాలలో నటించలేదు. ప్రస్తుతం ఈమె నిర్మాతగా మారగా పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా మారడంతో ఈ ఫోటో కాస్త వైరల్ అవుతుంది.

YS Jagan: వైయస్ జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలను కూల్చిన అధికారికి ప్రమోషన్!

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాండులో నివాసం ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో లోటస్ పాండ్ నివాసం ముందు అక్రమంగా కట్టడాలను నిర్మించారంటూ తెలంగాణ ప్రభుత్వం ఆక్రమ కట్టడాలను కూల్చివేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ లోటస్ పాండులోని నివాసం వద్ద బయట సెక్యూరిటీ కోసం మూడు షెడ్లను నిర్మించారు. అయితే ఇవి అక్రమంగా నిర్మించారని ఆ నిర్మాణాల వల్ల రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు వాటిని కూల్చివేశారు. ఇలా ఆ అక్రమ కట్టడాలు అంటూ కూల్చివేయడంతో వెంటనే ఐఏఎస్ అధికారి హేమంత్ పై సస్పెన్షన్ వేటు పడింది.

ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ఉన్నటువంటి ఆయన దగ్గరుండి ఈ కట్టడాలను కొల్చివేశారు అయితే తన పై అధికారులకు ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలా కూల్చి వేయడం పట్ల ఆయనపై ప్రభుత్వం వేటు వేసింది. ఇలా సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనకు ఎక్కడా కూడా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఈ విషయం కాస్త చర్చలకు కారణమైంది.

సస్పెండ్ అయిన అధికారికి ప్రమోషన్..
ఇకపోతే తాజాగా జోనల్ కమిషనర్ గా ఉన్నటువంటి హేమంత్ సస్పెండ్ కావడంతో తిరిగి ఈయనకు పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఈయనని ప్రమోట్ చేస్తూ పోస్టింగ్ ఇవ్వడంతో మరోసారి ఈ విషయం చర్చలకు దారితీస్తుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం హేమంత్ కి వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సమస్త ఎండిగా ప్రమోట్ చేస్తూ పోస్టింగ్ ఇవ్వడం విశేషం.