Chamanti Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు ఉప్పెన సినిమా ద్వారా దర్శకుడుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇలా దర్శకుడిగా మొదటి సినిమాతోనే బుచ్చిబాబు ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా గత 20 సంవత్సరాల క్రితం వచ్చిన చామంతి సినిమాకు దగ్గర పోలికలు ఉన్నాయి.
అసలు ఈ రెండు సినిమాలకు మధ్య ఉన్న ఆ పోలికలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.. 1992 వ సంవత్సరంలో ఆర్కే సెల్వమణి దర్శకత్వంలో రోజా హీరోయిన్ గా, ప్రశాంత్ హీరోగా తమిళంలో చెంబురుతి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాని తెలుగులో చామంతి పేరుతో డబ్ చేసి విడుదల చేశారు.
ఈ సినిమాలో చామంతి (రోజా) అన్నయ్య పాండి (రాధా రవి) భానుమతి రామకృష్ణ పనికి చేర్పిస్తారు. అయితే ఈయన వృత్తి చేపలు పట్టడం. భానుమతి మనవడు రాజా (ప్రశాంత్) తన చెల్లెల్ని ప్రేమిస్తున్నాడని తెలిసి. రాజా ఇంటికి వెళ్లి తనకు వార్నింగ్ ఇస్తాడు. రాజా మామ (నాజర్ క్యారెక్టర్) తన కూతురు మాలతి (వాసవి) ని రాజాకిచ్చి చేయాలనుకుని.. రాజా, చామంతిల ప్రేమకు అడ్డుగా ఉంటారు.మరి వీరిద్దరి ప్రేమకు అడ్డుపడినప్పటికీ రాజా చామంతి ఎలా కలిశారో వారి ప్రేమ ఎలా ఫలించింది అనేదే కథాంశం.
ఇక ఉప్పెన సినిమాలో కూడా హీరో చేపలు పడుతూ జాలరిగానే కనిపిస్తారు. ఈ సినిమాలో కూడా హీరో ఫ్యామిలీ చాలా పేదరికంలో ఉన్నట్టు చూపించారు.హీరో హీరోయిన్ ఇద్దరు ప్రేమించుకున్నప్పటికీ వీరి ప్రేమకు హీరోయిన్ తండ్రి అడ్డుపడగా చివరికి వీరిద్దరు ఎలా తమ ప్రేమను గెలిపించుకున్నారనేది ఉప్పెన సినిమా స్టోరీ ఇలా ఈ రెండు సినిమాల మధ్య కొన్ని పోలికలు ఉన్నాయని చెప్పాలి.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…