Connect with us

Featured

చందమామ సినిమాలో హీరోయిన్ ఎంత మారిపోయింది చూస్తే అస్సలు నమ్మలేరు…!!

Published

on

కృష్ణవంశీ దర్శకత్వం వహించిన చందమామ సినిమా ఎవరైనా మర్చిపోగలరా.. కాజల్ సింధు మీనన్ నటనతో మరియు అందాలతో సినిమా సూపర్ హిట్ అయ్యిందండంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ సినిమాలో కాజల్ ని మించి సింధు మీనన్ నాభి అందాలతో పెర్ఫార్మ్ చేసి మెస్మరైజ్ చేసింది. ఈ సినిమా మినహా మిగతా అన్ని సినిమాల్లో హోమ్లీ పాత్రల్లో నటిస్తూ పక్కింటి అమ్మాయి లాగ కనిపించింది సింధు మీనన్.

1994లో చైల్డ్ ఆర్టిస్ట్ గా రష్మీ అనే కన్నడ సినిమా పరిశ్రమలో కెరీర్ మొదలు పెట్టిన సింధు నలభై వరకు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళ కన్నడ, మలయాళీ సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు అన్ని భాషలు అలవోకగా మాట్లాడగలదు. స్వతహాగా మలయాళీ అయినా పుట్టి పెరిగింది మాత్రం బెంగుళూరు లోనే. చదువులు కూడా అక్కడే పూర్తి చేసిన సింధు 2001 లో భద్రాచలం సినిమాతో తెలుగు సినిమాలో అడుగుపెట్టింది. ఈ సినిమా విడుదల అయినా సమయానికి సింధుకి కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. ఈ సినిమా విడుదల అవ్వడానికి ముందే కన్నడలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది. 13 ఏళ్ళ వయసులోనే నాలుగు కన్నడ సినిమాల్లో నటించింది. భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం ఉన్న సింధు చిన్ననాటి నుండి నాట్యంలో శిక్షణ తీసుకుంది.

సింధుని ఒక ప్రోగ్రాం లో చుసిన జడ్జి ఒక దర్శకుడికి పరిచయం చేసి హీరోయిన్ గా మొదటి సినిమా ఆఫర్ ఇప్పించాడు. ఇక కొన్నేళ్ల పాటు సినిమాల్లో బిజీ గా ఉన్న సింధు ఆ తర్వాత మన తెలుగు అబ్బాయి అయినా డొమినిక్ ప్రభుని అనే ఒక టెక్కీ ని ఏప్రిల్ 2010 లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. చివరగా తెలుగులో సుభద్ర అనే సినిమాలో నటించి నటన కు గుడ్ బాయ్ చెప్పేసింది. ఇప్పుడు లండన్ లో సెటిల్ అయ్యి ఇద్దరు పిల్లలకు జన్మ ఇచ్చింది. ఒక బాబు మరియు ఒక పాపా.. ఆమె పేరు స్వెత్లానా. కానీ ఇప్పుడు మునపటి తన రూపంలో చాల మార్పులు వచ్చి గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉంది.

ఇక పెళ్లయ్యాక అనుకోకండా ఒక చీటింగ్ కేసులో కూడా ఇరుక్కుంది సింధు. సింధు మీనన్ సోదరుడు బెంగుళూరు లో ని బ్యాంకు అఫ్ బరోడాలో ముప్పై లక్షల అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో పూచీకత్తుగా ఉన్న సింధుపై అలాగే మనోజ్ పై కేసు నమోదు చేసారు పోలీసులు. ఇక అప్పు కోసం తనఖా పెట్టిన పత్రాలు సైతం నకిలీవి అని తేలడంతో ఇదే కేసు విషయమే సింధుని సైతం ఇండియాకి రప్పించారు. కానీ విషయం ఆ తర్వాత సర్దుమణగడంతో తిరిగి లండన్ వెళ్ళిపోయింది సింధు.

సినిమాల్లో అవకాశాల తగ్గాక కొన్ని సీరియల్స్ లోను టీవీ షోస్ లో నటించి హోస్ట్ చేసిన సింధు 2012 తర్వాత ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు. కేవలం ఫ్యామిలికి మాత్రమే ప్రియారిటీ ఇస్తూ ఒక్క టీవీ షో లో కూడా కనిపించలేదు. చివరగా శ్రీమాన్ శ్రీమతి అనే పాపులర్ తమిళ టీవీ షోకి ప్రొడ్యూసర్ గా మరియు హోస్ట్ గా వ్యవహరించింది. ఈ షో అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఇక సింధు తమ్ముడు కార్తీక్ VJ గా పనిచేసి ‘సుకుమార’, వండర్ వరల్డ్, లిఫ్ట్ కోడ్ల వంటి కన్నడ సినిమాల్లో హీరోగా నటించాడు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!