ప్రస్తుత జీవన శైలిలో ఆహారపు అలవాట్ల విషయంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. శారీరక శ్రమ విషయంలో ఎలాంటి వ్యాయామం చేయకపోవడంతో బరువు పెరిగిపోతున్నారు. దీంతో వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు. ఆ తర్వాత బరువు తగ్గడానికి వివిధ రకాలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కొందరు బరువు తగ్గడం లేదు. బరువు తగ్గాలని అనుకునే వారు ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలతో సహా ఇతర పోషకాలు అధికంగా ఉండే వాటిని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
బరువును అతి వేగంగా తగ్గాలనుకునే వారికి పలు రకాల గింజలను ఆహారంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో ముఖ్యంగా చియా, గుమ్మడికాయ, అవిసె గింజలు, పుచ్చకాయ మొదలగునవి ఉన్నాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటంతో బరువు నియంత్రణలో ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ గింజలతో కొద్దిగా బెల్లంను లడ్డూల్లాగా తయారు చేసుకొని తినాలి. దీంతో ఆకలి వేయకుండా ఉండటంతో శరీరంలో ఎక్కువ కొవ్వు చేరకుండా ఉంటుంది.
అయితే ఈ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలంటే.. అవిసె గింజలు, పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు, చియా గింజలు గింజలను కప్పు చొప్పున తీసుకోవాలి.. అతేకాకుండా నెయ్యిని ఆఫ్ కప్పు, రెండు కప్పుల ఓట్స్, కప్పు బెల్లం మరియు ఎండిన పండ్లను తీసుకోవాలి. ముందుగా గింజలను ఓ గిన్నెలో తీసుకొని వేడి చేయాలి. గింజలను చల్లార్చి వాటితో పాటు వేడి చేసిన నెయ్యిని కలపాలి.
తర్వాత ఓట్స్ బాగా వేయించిన అనంతరం దానిలో జీడిపప్పు, ఎండుద్రాక్ష, బెల్లం పొడి జోడించాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని కదిలిస్తూ.. బెల్లం పాకం బాగా కలిసే వరకు చూడాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని చల్లార్చాలి. దీనిలో చల్లార్చిన విత్తనాలను ఇందులో వేసి చేతులకు నెయ్యి పూసుకొని లడ్డూలను తయారు చేయాలి. ఈ లడ్డూలను ఉదయం, సాయంత్రం రెండు చొప్పున తీసుకుంటే కొద్ది రోజుల్లోనే లావు తగ్గే అవకాశం ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…