Child artist Sahasra : రౌడీ అల్లుడు, మేజర్ చంద్రకాంత్, సమర సింహా రెడ్డి, హిట్లర్, ముగ్గురు మొనగాళ్లు వంటి సినిమాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సహస్ర గుర్తుందా.. ముఖ్యంగా సమరసింహా రెడ్డి సినిమాలో బాలయ్య ముగ్గురు చెల్లెల్లో చిన్న చెల్లి సరస్వతిగా నటించిన అమ్మాయి సహస్ర గుర్తుందా. ఆ సినిమాలో బాలయ్య చెల్లిగా కాళ్లు చచ్చుబడిన అమ్మాయి పాత్రలో నటించిన సహస్ర ముఖ్యంగా రైల్వే ట్రాక్ సీన్ లో బాగా నటించింది. అందులో ఫ్యాక్షన్ ఎంత ఆకట్టుకుందో అంతే ఎఫెక్ట్ ఇలాంటి సెటిమెంట్ సీన్స్ కూడా అలరించాయి. అయితే ఆ సినిమాలో నటించిన సహస్ర ఆ సినిమా తరువాత మళ్ళీ సినిమాల్లో నటించలేదు. మళ్ళీ చాలా కాలానికి యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూలో మెరిసిన ఈ అమ్మాయి తన గురించి వివరించింది.
పెద్ద హీరోలతో నటించిన సహస్ర…
ఎన్టీఆర్, కృష్ణం రాజు, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు వంటి పెద్ద హీరోలతో నటించిన సహస్ర కు భాను చందర్ గారి సినిమా ‘ఉద్యమం’ మొదటి సినిమా కాగా, మేజర్ చంద్రకాంత్ సినిమాలో మనోజ్ తో పాటు కలిసి నటించింది. మనోజ్ తో పాటు షూటింగ్ కి కలిసి వచ్చేదట సహస్ర. చిన్న పిల్ల అని అందరూ ముద్దు చేసేవారట. ఇక హిట్లర్ లో నటించడం వల్ల చిరంజీవి గారితోను అనుబంధం ఉందని అలాగే రామ్ చరణ్ బొమ్మలతొ ఆడుకునేదాన్ని చెన్నైలో వాళ్ళింట్లో అంటూ తెలిపారు సహస్ర.
తన కోసం రామ్ చరణ్ ఉప్మా కూడా చేసిపెట్టాడని ఆ మధురానుభూతులను మర్చిపోలేనని తెలిపారు. ఇక సమర సింహా రెడ్డి సినిమా తరువాత సినిమాల్లో అవకాశాలు వస్తున్నా ఇక చేయలేదని చదువు మీద ఇంట్రస్ట్ తో చదువు డిస్టర్బ్ కాకూడదని యాక్టింగ్ మానేసినట్లు తెలిపారు. మాస్టర్స్ యిన్ బయోటెక్నాలజీ చేసిన సహస్ర ప్రస్తుతం సొంత వ్యాపారంలో ఉన్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ కాస్త బోద్దుగా తయారైనా క్యూట్ మాటలతో తన కెరీర్ అలాగే అప్పట్లో హీరోలతో తాను ఆడుకున్నది వంటి విషయాలను పంచుకుంది.
ఫుట్బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…
భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన…
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రికి ప్రత్యేకమైన అనుభూతి. చాలా మంది ఈ విషయంలో కొత్తదనం, ట్రెండ్, వినూత్నతకు…
నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…
హిందూ పంచాంగంలో ప్రతి పర్వదినానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో వైశాఖ మాసంలో వచ్చే పరశురామ ద్వాదశి కూడా…