Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నవారికి ఎదుగుదల ఉంటుంది. కానీ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే వారిని అణిచివేయాలని ఎంతోమంది చూస్తుంటారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది టాలెంటెడ్ హీరోలను ఇండస్ట్రీలో తొక్కేయడం వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పాలి. అయితే చిరంజీవి మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో చిరంజీవి ఎదుగుదలను చూసి ఓర్వ లేనటువంటి కొందరు ఆయనపై ఏకంగా విష ప్రయోగం చేసి తనని చంపేయాలని కూడా కుట్రలు పడ్డారని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిరంజీవి తనపై జరిగినటువంటి విష ప్రయోగం గురించి మరోసారి గుర్తు చేసుకున్నారు.
తాను మరణం మృదంగం సినిమా షూటింగ్ చేస్తున్న సమయం తనపై ఈ విష ప్రయోగం జరిగిందని చిరంజీవి తెలియచేశారు. ఈ సినిమా షూటింగ్ విరామ సమయంలో ఒక అభిమాని తన వద్దకు వచ్చి తన బర్త్ డే అని చెప్పి తనతో కేక్ కట్ చేయించారని చిరు తెలిపారు. అయితే కేక్ తనకు స్పూన్ తో తినడం అలవాటు కానీ ఆ అభిమాని మాత్రం బలవంతంగా తన చేతితో కేక్ తినిపించారు.
కేక్ తిన్న వెంటనే తనకు చాలా చేదుగా అనిపించింది వెంటనే కేక్ మొత్తం పడేసానని ఈ విషయం చిత్ర బృందానికి చెప్పగా వెంటనే తనని పట్టుకున్నారని చిరు తెలిపారు. ఇక కేక్ శాంపుల్ టెస్టింగుకు పంపించగా అందులో విషం కలిపినట్టు రిపోర్ట్స్ వచ్చాయని చిరు తెలిపారు. అయితే తనని పట్టుకొని బాగా కొట్టగా నేను ఆ అభిమానితో మాట్లాడలేదని.. కేరళ నుంచి ఏదో వశీకరణ పొడి తెచ్చి కేకులో కలిపానని చివరికి ఆ అభిమాని ఒప్పుకున్నారని తెలిపారు. అయితే తాను అభిమానిని ఏమీ అనకుండా వదిలేసానని చిరు అప్పటి విషయాలను గుర్తు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…