Chiranjeevi: గత కొంతకాలంగా మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ వివాదం రెండు కుటుంబాల మధ్య అలాగే కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఈ వివాదానికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో అల్లు అరవింద్ ఒక మెట్టు కిందికి దిగారని తెలుస్తోంది. త్వరలోనే తన కుమారుడు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో హైదరాబాదులో నిర్వహించే ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కోరారట.
ఈ విధంగా తన తండ్రి చెప్పడంతో అల్లు అర్జున్ కూడా చేసేదేమి లేక తన సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా రావాలని చిరంజీవిని చెప్పడంతో చిరంజీవి తనకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా వేడుకకు రాలేనని అయినప్పటికీ పుష్ప 2 ప్రమోషన్ కోసం నేను కూడా ఒక చిన్న వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తానని చెప్పారట.
చిరంజీవి ఇందుకు ఒప్పుకోవడం వెనుక సురేఖ ప్రమేయం ఉందని తెలుస్తుంది. కేవలం చిరంజీవి కారణంగా తన అల్లుడు సినిమాకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో సురేఖ చెప్పడం వల్ల చిరంజీవి కూడా ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా చిరంజీవి పుష్ప 2 సినిమా కోసం ముందుకు రావడంతో మెగా అల్లు కుటుంబాల మధ్య వివాదానికి దాదాపు చెక్ పడినట్లేనని అందరూ భావిస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…