Clash between Chiranjeevi & Rajashekhar : ఇండస్ట్రీలో అందరం కలిసే ఉన్నాం అంటూ మాటలు చెప్పినా కొందరు ఆర్టిస్ట్ల మధ్య కోల్డ్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. కొంతమంది బహిరంగంగానే విమర్శించుకుంటారు కూడా. అలాంటి వాళ్లలో అందరికీ మొదట గుర్తొచ్చేది మోహన్ బాబు గారు. ఆయన ఎవరి గురించి నచ్చక పోయినా మీడియా ముందు కొచ్చి మరీ చెబుతుంటారు. ముఖ్యంగా చిరంజీవి గారిని కొన్ని విషయాల్లో ఆయన విమర్శించడం మెగా స్టార్ అభిమానులకు నచ్చదు కూడా. ఇక అలా మెగాస్టార్ తో విబేధాలు ఉన నటుడు రాజశేఖర్. రాజశేఖర్ గారు కాంగ్రెస్ లో ఉన్న సమయంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టాలనుకున్నపుడు రాజశేఖర్ గారు చేసిన విమర్శ వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి.

14 సంవత్సరాల క్రితం జరిగింది ఇదే…
హీరో రాజశేఖర్ గారు చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుతూ అనుభవం లేని వారు రాజకీయాల్లో ఎందుకు పనికిరారు అన్నట్లుగా మాట్లాడారు. దీంతో అగ్రహించిన చిరంజీవి అభిమానులు రాజశేఖర్ గారు తన కుటుంబంతో కారులో ప్రయాణిస్తుండగా దాడి చేయడంతో చిరంజీవి గారు వెంటనే స్పందించి మరోసటి రోజు ఉదయాన్నే రాజశేఖర్ ఇంటికి వెళ్లారు.

అయితే అక్కడ ఆయన లేకపోవడంతో ఆయన వచ్చే వరకూ ఎదురుచూసి ఆ తరువాత ఆయనను కలిసి తన అభిమానులు ఆవేశానికి చిరంజీవి గారు మీడియా ముందు రాజశేఖర్ గారికి క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పినా ఆ గొడవ అంతటి తో అయిపోయిందనుకున్నా ఆ ఇష్యూ తాలూకు ఫలితాలు మాత్రం చాలా ఏళ్ళు కొనసాగింది.



























