తాలిబన్ల అధీనంలోకి వచ్చిన అఫ్గానిస్థాన్లో పరిస్థితులు రోజు రోజుకూ అల్లకల్లోలంగా మారుతున్న విషయం తెలిసిందే.. ఇక పరిస్థితులు మరింత దారుణంగా మారడంతో ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన చేసింది భారత్. అయితే ఇప్పటికే భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బందిని స్వదేశానికి తరలించారు.

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆఫ్గనిస్తాన్ కాబుల్లోని ఇండియన్ ఎంబసీ సిబ్బంది సహా భద్రతా అధికారులను హుటాహుటిన భారత్ కు తరలించాలని నిర్ణయించినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చీ తన ట్విటర్ వేదికగా తెలియజేసారు. ఈ నేపధ్యంలో కాబుల్ నుంచి 120 మందికి పైగా అధికారులు మరియూ సిబ్బందితో వాయుసేన సి-17 విమానం కాబుల్ నుంచి బయల్దేరింది.

































