Pushpa - Venumadhav: పుష్ప సినిమా డైలాగును అప్పుడే చెప్పిన కమెడియన్ వేణు మాధవ్…వీడియో వైరల్!
Pushpa – Venumadhav: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాలోని డైలాగులు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ వైరల్ గా మారింది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. “నా కాలు మీద నా కాలు వేసుకుంటే తప్పేముంది… పక్కోడి కాలు మీద కాలు వేయలేదు కదా అని చెప్పే డైలాగ్ బాగా పాపులర్ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ డైలాగ్ ను సుకుమార్ తన అన్న దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నానని తెలిపారు.
కానీ ఈ డైలాగ్ కు సంబంధించిన ఓ విషయం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ డైలాగ్ గురించి ఐదు సంవత్సరాల క్రితమే వేణుమాధవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదే డైలాగ్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో వేణుమాధవ్ మాట్లాడుతూ ఒక హీరో తనని కాలుపై కాలు వేసే అలవాటు ఉందా అని అడిగారని చెప్పారు.
ఇలా హీరో అడగడంతో అవును నా కాలు పై నా కాలు వేసుకుంటే తప్పేముంది… ఇతరులపై వేస్తే తప్పు కాని అని అన్నాను. ఇలా చెప్పే సరికి ఆ హీరో రెండు నిమిషాల పాటు షాక్ అయ్యారు.అలా తప్పు కదా అయ్యా అని అనడంతో తప్పేముంది సార్ నా కాలు పై నేను వేసుకుంటున్నాను అని చెప్పగా అతను సరే కానీ మీ ఇష్టం అంటూ వెళ్లిపోయారు. అయితే ఈ డైలాగ్ గురించి సుకుమార్ కు తెలియదని చెప్పలేము కానీ కొంతమంది మాత్రం వేణుమాధవ్ రియల్ డైలాగును సుకుమార్ రీల్ డైలాగ్స్ కోసం ఉపయోగించారని కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…