చలికాలం వచ్చిందంటే ఎన్నో అంటువ్యాధులు వస్తాయి.వాతావరణంలో ఒక్కసారిగా మార్పు లు సంభవించడం వల్ల అనేక వ్యాధులు మనల్ని వెంటాడుతుంటాయి.అందులో జలుబు, దగ్గు, జ్వరం తీవ్రంగా వేధిస్తుంటాయి. ఇలాంటి సీజనల్ వ్యాధుల నుంచి విముక్తి పొందాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. జాగ్రత్తలను పాటించడం ద్వారా భయంకరమైన అంటు వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండడంతో జలుబు విపరీతంగా వేధిస్తుంటుంది.
ప్రత్యేకించి చలికాలంలో గాలి తక్కువగా ఉండటం వల్ల చాలా వరకు దుమ్ము ,ధూళి కణాలు గాలిలోనే మిగిలిపోతుంటాయి. ఎక్కువగా మెట్రో నగరాలలో నివసించే ప్రజలు ఈ వాతావరణ కాలుష్యం బారిన పడుతుంటారు.అంతేకాకుండా మెట్రోనగరాల్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉండటంవల్ల వాహనాల నుంచి వెలువడే కాలుష్యం పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నుంచి ఏర్పడే కాలుష్యం వల్ల తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
ఇక చలికాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో జలుబు చేసే ప్రమాదం ఉంటుంది. ఎక్కువకాలం జలుబుతో బాధపడుతుంటే ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా వాతావరణంలో పొల్యూషన్ వల్ల శ్వాసకోస సమస్యలు ఏర్పడి క్యాన్సర్ కి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటి వల్ల ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇటువంటి భయంకరమైన వ్యాధుల నుంచి విముక్తి పొందాలంటే చలికాలంలో వీలైనంతవరకు తగినంత జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం. వీలైనంత వరకు మన శరీర ఉష్ణోగ్రతలు తగ్గకుండా చూసుకోవాలి. సాధ్యమైనంతవరకు చల్లటి ద్రావణాలను దూరం పెట్టాలి. వీలైనంత వరకు వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలి. అంతేకాకుండా మన పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవటం ద్వారా దోమల బెడద తగ్గి ఇలాంటి సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…