చలికాలం వచ్చిందంటే ఎన్నో అంటువ్యాధులు వస్తాయి.వాతావరణంలో ఒక్కసారిగా మార్పు లు సంభవించడం వల్ల అనేక వ్యాధులు మనల్ని వెంటాడుతుంటాయి.అందులో జలుబు, దగ్గు, జ్వరం తీవ్రంగా వేధిస్తుంటాయి. ఇలాంటి సీజనల్ వ్యాధుల నుంచి విముక్తి పొందాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. జాగ్రత్తలను పాటించడం ద్వారా భయంకరమైన అంటు వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండడంతో జలుబు విపరీతంగా వేధిస్తుంటుంది.

ప్రత్యేకించి చలికాలంలో గాలి తక్కువగా ఉండటం వల్ల చాలా వరకు దుమ్ము ,ధూళి కణాలు గాలిలోనే మిగిలిపోతుంటాయి. ఎక్కువగా మెట్రో నగరాలలో నివసించే ప్రజలు ఈ వాతావరణ కాలుష్యం బారిన పడుతుంటారు.అంతేకాకుండా మెట్రోనగరాల్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉండటంవల్ల వాహనాల నుంచి వెలువడే కాలుష్యం పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నుంచి ఏర్పడే కాలుష్యం వల్ల తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
ఇక చలికాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో జలుబు చేసే ప్రమాదం ఉంటుంది. ఎక్కువకాలం జలుబుతో బాధపడుతుంటే ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా వాతావరణంలో పొల్యూషన్ వల్ల శ్వాసకోస సమస్యలు ఏర్పడి క్యాన్సర్ కి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటి వల్ల ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇటువంటి భయంకరమైన వ్యాధుల నుంచి విముక్తి పొందాలంటే చలికాలంలో వీలైనంతవరకు తగినంత జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం. వీలైనంత వరకు మన శరీర ఉష్ణోగ్రతలు తగ్గకుండా చూసుకోవాలి. సాధ్యమైనంతవరకు చల్లటి ద్రావణాలను దూరం పెట్టాలి. వీలైనంత వరకు వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలి. అంతేకాకుండా మన పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవటం ద్వారా దోమల బెడద తగ్గి ఇలాంటి సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.































