Cricketer Hardik Pandya : భారతీయులు అనగానే సహనం చూపిస్తామనే పేరుంది. ఇక క్రికెట్ లో కెప్టెన్ గా ఉన్న వ్యక్తులు ఇప్పటి వరకు ఆ పేరును అలానే నిలబెట్టారు. వేరే దేశంతో ఆడేటపుడు నోరుజారాకుండా ఇండియా పరువు నిలబెట్టారు. అయితే ఇప్పుడు మాత్రం భారత ఆటగాడు హార్దిక్ పాండ్య సహచర ఆటగాడితో నడుచుకున్న తీరు విమర్శల పాలయింది. నెటిజన్స్ నుండి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. క్రికెటర్ గా ఎంత టాలెంట్ ఉన్నా ఎదుటివారికి మర్యాద ఇవ్వడం నేర్చుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు చాలా మంది నెటిజన్స్.

సుందర్ ను బూతులు తిట్టిన హార్దిక్…
శ్రీలంక తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో వైస్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్య సహనాన్ని కోల్పోయి సహచర ఆటగాడినే బూతులు తిట్టాడు. ఇన్నింగ్స్ సమయంలో 11 ఓవర్ లో నీళ్ల బాటిల్ ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో హార్దిక్ పాండ్య తన సహచర ఆటగాడైనా వాషింగ్టన్ సుందర్ ను అసభ్య పదజాలంతో దూషించాడు. నీళ్లు ఇవ్వకుండా ఎవని… (G**nd Mara Rahe Ho udhar) అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు.

అయితే పాండ్య మాట్లాడిన మాటలు స్టంప్ మైక్ లో రికార్డు అవడంతో సోషల్ మీడియా వరకు చేరి పోయాయి. ఇక దీనికి సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవడంతో పాండ్య మీద నెటిజన్స్ విరుచుకు పడుతున్నారు. క్రికెట్ ఆడటం కాదు ముందు మాట్లాడటం, ఓర్పుగా ఉండటం నేర్చుకో అంటూ కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ఇండియా పరువు తీయొద్దు వైస్ కెప్టెన్ అయినంత మాత్రాన ఇంత పొగరు పనికిరాదు అంటూ ఏకి పారేస్తున్నారు.































