General News

మరణ శిక్షను అడ్డుకున్నారు.. కోటి రూపాయిలు పరిహారం కట్టారు?

కోట్లకు పడగలెత్తిన సంపన్నులు ఆ డబ్బులు సంపాదించడం కంటే వాటిని ఖర్చు చేయడంలో కూడా తన మానవత్వాన్ని చాటుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఓ వ్యక్తి చేసిన సహాయం, ఆయన మంచితనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న ఘటన తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది.లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ కోటి రూపాయలు పరిహారం చెల్లించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళకి చెందిన కృష్ణన్(45) యూఏఈలో ఉద్యోగం చేసేవారు. తొమ్మిదేళ్ల కిందట 2012లో కారు యాక్సిడెంట్ చేయడంతో సూడాన్‌కి చెందిన ఒక బాలుడు మృతి చెందాడు.దీంతో కేవలం అతని నిర్లక్ష్యం కారణంగానే కారు ప్రమాదం చోటుచేసుకుని బాలుడు మృతి చెందాడని సాక్షాలు ఉండడంతో కేవలం అతని నిర్లక్ష్యం కారణంగానే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని భావించిన న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది.

న్యాయస్థానం విధించిన మరణశిక్ష నుంచి కృష్ణన్ కాపాడటం కోసం తమ కుటుంబం అన్ని విధాల ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా క్షమాభిక్ష కోరుతూ బాలుడు కుటుంబాన్ని ఎన్నిసార్లు సంప్రదించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే బాలుడి కుటుంబం సూడాన్ వెళ్లిపోవడంతో క్షమాభిక్ష ప్రయత్నాలు నెరవేరలేదు. చివరికి లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీని కలిసి విషయం విన్నవించారు. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ తనకు అందజేయాల్సిందిగా యూసఫ్ తెలిపారు.

కేసు వివరాలన్నింటినీ పరిశీలించిన యూసుఫ్ ఈ ప్రమాదం నిర్లక్ష్యం కారణంగా కాదని,కేవలం ప్రమాదవశాత్తు మాత్రమే జరిగిందని భావించి ఎలాగైనా తనని మరణ శిక్ష నుంచి విముక్తి కల్పించాలని భావించాడు. అప్పటినుంచి అతను ఎన్నో ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అదే విధంగా సూడాన్ లో ఉన్నటువంటి బాలుడు కుటుంబాన్ని అబుదాబి రప్పించారు. పలు దఫాలు వారితో చర్చించి వారిని క్షమాభిక్షకు ఒప్పించారు.ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదుర్చుకొని కోర్టుకు కోటి రూపాయలను పరిహారం చెల్లించి అతనికి మరణశిక్ష నుంచి విముక్తి కల్పించారు.ఈ విధంగా చేయని తప్పుకు శిక్ష పడే కాపాడటమే కాకుండా కుటుంబానికి మొత్తం సహాయం చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కరుప్పు లో త్రిష ఎంపికపై.. డైరెక్టర్ ఓపెన్ స్టేట్‌మెంట్!

తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కరుప్పు’పై ఇప్పటికే మంచి అంచనాలు…

7 minutes ago

ఏసీ లేకుండానే ఇల్లు చల్లగా.. ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చేయండి!

వేసవి రాగానే ఇంట్లో ఉండటం చాలా మందికి సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పై అంతస్తుల్లో నివసించే వారికి గదులు భగ్గుమంటూ…

29 minutes ago

చక్రి మరణంపై షాకింగ్ నిజాలు.. రఘు కుంచె క్లారిటీ

దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…

47 minutes ago

ఇలా కూర్చుంటే రక్తపోటు పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్!

ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…

59 minutes ago

దేవుడికి నమస్కారం చేస్తే ఎందుకు కళ్లు మూసుకుంటాం? అసలు కారణం ఇదే!

దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…

1 hour ago

తెలంగాణలో ఎవరి జనాభా ఎక్కువ?.. కుటుంబ సర్వేలో బిగ్ రివీల్

తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…

2 hours ago