కోట్లకు పడగలెత్తిన సంపన్నులు ఆ డబ్బులు సంపాదించడం కంటే వాటిని ఖర్చు చేయడంలో కూడా తన మానవత్వాన్ని చాటుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఓ వ్యక్తి చేసిన సహాయం, ఆయన మంచితనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న ఘటన తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది.లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ కోటి రూపాయలు పరిహారం చెల్లించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేరళకి చెందిన కృష్ణన్(45) యూఏఈలో ఉద్యోగం చేసేవారు. తొమ్మిదేళ్ల కిందట 2012లో కారు యాక్సిడెంట్ చేయడంతో సూడాన్కి చెందిన ఒక బాలుడు మృతి చెందాడు.దీంతో కేవలం అతని నిర్లక్ష్యం కారణంగానే కారు ప్రమాదం చోటుచేసుకుని బాలుడు మృతి చెందాడని సాక్షాలు ఉండడంతో కేవలం అతని నిర్లక్ష్యం కారణంగానే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని భావించిన న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది.
న్యాయస్థానం విధించిన మరణశిక్ష నుంచి కృష్ణన్ కాపాడటం కోసం తమ కుటుంబం అన్ని విధాల ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా క్షమాభిక్ష కోరుతూ బాలుడు కుటుంబాన్ని ఎన్నిసార్లు సంప్రదించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే బాలుడి కుటుంబం సూడాన్ వెళ్లిపోవడంతో క్షమాభిక్ష ప్రయత్నాలు నెరవేరలేదు. చివరికి లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీని కలిసి విషయం విన్నవించారు. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ తనకు అందజేయాల్సిందిగా యూసఫ్ తెలిపారు.
కేసు వివరాలన్నింటినీ పరిశీలించిన యూసుఫ్ ఈ ప్రమాదం నిర్లక్ష్యం కారణంగా కాదని,కేవలం ప్రమాదవశాత్తు మాత్రమే జరిగిందని భావించి ఎలాగైనా తనని మరణ శిక్ష నుంచి విముక్తి కల్పించాలని భావించాడు. అప్పటినుంచి అతను ఎన్నో ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అదే విధంగా సూడాన్ లో ఉన్నటువంటి బాలుడు కుటుంబాన్ని అబుదాబి రప్పించారు. పలు దఫాలు వారితో చర్చించి వారిని క్షమాభిక్షకు ఒప్పించారు.ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదుర్చుకొని కోర్టుకు కోటి రూపాయలను పరిహారం చెల్లించి అతనికి మరణశిక్ష నుంచి విముక్తి కల్పించారు.ఈ విధంగా చేయని తప్పుకు శిక్ష పడే కాపాడటమే కాకుండా కుటుంబానికి మొత్తం సహాయం చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…