తమిళ స్టార్ హీరో సూర్య, శృతిహాసన్ జంటగా తెరకెక్కిన సెవెంత్ సెన్స్ సినిమా ద్వారా పరిచయమైన నటి ధన్య బాలకృష్ణ.ఈ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ధన్య తరువాత పలు సినిమాలలో ఎంతో అద్భుతంగా నటించి మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.లవ్ ఫెయిల్యూర్, ఎటో వెళ్లిపోయింది మనసు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు,విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అందరికీ ఎంతో గుర్తుండిపోయే ఒకే ఒక సీన్లో కనిపించి సందడి చేశారు. అదే విధంగా తెలుగులో నేను శైలజ, రాజు గారి గది, సాఫ్ట్వేర్ సుదీర్ సినిమాలతో మరింత గుర్తింపు సంపాదించుకున్న ధన్య తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.
ప్రస్తుతం ధన్య బెంగళూరులోనే నివసిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. తన ముద్దు పేరు పప్పు అని, తాను నటించిన రాజా రాణి సినిమాలో ఒక సన్నివేశంలో తనని మందు తాగుతున్నట్లు చూపించారు. కానీ అది నిజంగా మందు కాదు, కేవలం మంచినీళ్లు మాత్రమేనని ఈ సందర్భంగా ధన్య తెలిపారు.
తను పెద్దగా స్నేహితులతో కూడా కలవని, వీకెండ్స్ మాత్రం సరదాగా స్నేహితులతో కలిసి బయట భోజనం చేస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే తనకు పవన్ కళ్యాణ్, సూర్య, రణబీర్ కపూర్ తన క్రష్ అని ఎప్పటికైనా వీరితో సినిమా తీయాలనేది తన కోరికని తన మనసులో మాటను బయటపెట్టారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…