ఉదయం లేచిన మొదలు బ్రేక్ ఫాస్ట్ చేయనిదే చాలామందికి పని మొదలు కాదు. అయితే అధిక బరువుతో బాధపడే వారు ఎక్కువగా బ్రేక్ ఫాస్ట్ వల్ల కూడా బరువు పెరుగుతున్నామని.. వాటిని దూరం పెట్టేద్దామని అనుకుంటుంటారు. కానీ అది చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఎక్కువగా క్యాలరీలు ఉంటే.. సాధారణంగా బరువు పెరిగి లావుగా కనిపిస్తారు.
అయితే క్యాలరీలు తగ్గించుకోవడానికి వ్యాయమాలు చేయాలి కానీ.. బ్రేక్ పాస్ట్ మానకూడదు అనేది వైద్యులు చెబుతున్న మాట. సమయానికి నిద్ర పోకపోవడం, వేళకు తినకపోవడం కూడా బరువుకు కారణాలు అవుతున్నాయి. నిజానికి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తిననివారు.. బ్రేక్ ఫాస్ట్ తీసుకునేవారి కంటే వేగంగా బరువు పెరుగుతారట. ఎందుకంటే ఇలా బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే శరీరంలో మెటబాలిజం నెమ్మదించి.. ఆకలి ఎక్కువగా వేస్తుంది.
దీంతో మధ్యాహ్నం అన్నం తినే సమయంలో ఎక్కువగా లాగేస్తారు. దీంతో బరువు పెరగడానికి ఇది కారణం అవుతుంది. ఇలా బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. అదేంటంటే.. 54 శాతం వరకు టైప్ 2 డయాబెటీస్ వస్తుందట.
దీనిని హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ పరిశోధనలో తేలిందట. వేరు శనగ వెన్న తీసుకోవడంలో లావు తగ్గడానికి అవకాశం ఉందట. ఆకలిని తగ్గించడంలో ఎక్కువగా ఉపయోగపడతాయట. దీనిని ఎక్కువగా చాలామంది తీసుకోరు. కారణం ఏంటంటే.. ఇందులో కొవ్వు కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ దీనిని మితంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు.
టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్డ్ పేర్లలో ఒకరు.…
సర్పంచులకు ఉపశమనం.. నిలిచిన నిధుల వినియోగానికి అనుమతి ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Government of…
ఉత్తరప్రదేశ్లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…
తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్లో సుహాస్ ఇప్పుడు…
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన వ్యక్తిగత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన యష్ కొత్త చిత్రం టాక్సిక్ నుంచి తాజా టీజర్ విడుదలైంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న…