ఉదయం లేచిన మొదలు బ్రేక్ ఫాస్ట్ చేయనిదే చాలామందికి పని మొదలు కాదు. అయితే అధిక బరువుతో బాధపడే వారు ఎక్కువగా బ్రేక్ ఫాస్ట్ వల్ల కూడా బరువు పెరుగుతున్నామని.. వాటిని దూరం పెట్టేద్దామని అనుకుంటుంటారు. కానీ అది చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఎక్కువగా క్యాలరీలు ఉంటే.. సాధారణంగా బరువు పెరిగి లావుగా కనిపిస్తారు.
అయితే క్యాలరీలు తగ్గించుకోవడానికి వ్యాయమాలు చేయాలి కానీ.. బ్రేక్ పాస్ట్ మానకూడదు అనేది వైద్యులు చెబుతున్న మాట. సమయానికి నిద్ర పోకపోవడం, వేళకు తినకపోవడం కూడా బరువుకు కారణాలు అవుతున్నాయి. నిజానికి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తిననివారు.. బ్రేక్ ఫాస్ట్ తీసుకునేవారి కంటే వేగంగా బరువు పెరుగుతారట. ఎందుకంటే ఇలా బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే శరీరంలో మెటబాలిజం నెమ్మదించి.. ఆకలి ఎక్కువగా వేస్తుంది.
దీంతో మధ్యాహ్నం అన్నం తినే సమయంలో ఎక్కువగా లాగేస్తారు. దీంతో బరువు పెరగడానికి ఇది కారణం అవుతుంది. ఇలా బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. అదేంటంటే.. 54 శాతం వరకు టైప్ 2 డయాబెటీస్ వస్తుందట.
దీనిని హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ పరిశోధనలో తేలిందట. వేరు శనగ వెన్న తీసుకోవడంలో లావు తగ్గడానికి అవకాశం ఉందట. ఆకలిని తగ్గించడంలో ఎక్కువగా ఉపయోగపడతాయట. దీనిని ఎక్కువగా చాలామంది తీసుకోరు. కారణం ఏంటంటే.. ఇందులో కొవ్వు కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ దీనిని మితంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు.
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…