Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దిల్ రాజు వారసుడు సినిమా ద్వారా తరచు వార్తలు నిలుస్తున్నారు. ఇక నైజాం హక్కులను దిల్ రాజు కొనుగోలు చేస్తూ పెద్ద ఎత్తున నైజాం ఏరియాలో సినిమాలను విడుదల చేస్తుంటారు. అయితే ప్రస్తుతం మైత్రి వాళ్ళు నైజాంలో తమ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ మొదలుపెట్టారు.
ఇలా నైజాంలో మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టడంతో తన బిజినెస్ ప్రభావం చూపుతుంది అన్న దిల్ రాజు ఏకంగా ఇండస్ట్రీలో నిర్మాతలను టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పటికే వారసుడు సినిమా మైత్రి మేకర్స్ నుంచి వస్తున్న సినిమాలకు టార్గెట్ అయింది ఈ క్రమంలోనే దిల్ రాజు మైత్రి వాళ్లకు తన థియేటర్లో ఇవ్వడం లేదని తన థియేటర్లు మొత్తం వారసులు సినిమాకి ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు.
ఇదిలా పక్కన పెడితే శాకుంతలంవిషయంలో కూడా దిల్ రాజు తెలుగు నిర్మాతలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే శాకుంతలం సినిమా విడుదల విషయంలో ఆ నిర్మాతలను ఈయన టార్గెట్ చేశారని భావిస్తున్నారు.సమంత నటించిన శకుంతలం సినిమాని ఫిబ్రవరి 17వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఇదే రోజున వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన సర్ సినిమా కూడా విడుదల కానుంది ఈ సినిమాని సితార సంస్థ నిర్మించారు. ఇక అదే రోజే విశ్వక్సేన్ ధమ్కీ సినిమా విడుదల కానుంది.
విశ్వక్ ధమ్కీ సినిమాకు ఆయనే నిర్మాతగా, దర్శకత్వం వహించారు. ఇక గీత ఆర్ట్స్ నుంచి వినరో భాగ్యము విష్ణు కథ సినిమా కూడా రాబోతుంది ఈ చిత్రాన్ని బన్నీ వాసు గీత ఆర్ట్స్ 2 బ్యానర్ ద్వారా నిర్మించారు ఇలా ఫిబ్రవరి 17వ తేదీ ఉద్దేశపూర్వకంగానే దిల్ రాజు సితార గీత ఆర్ట్స్ బ్యానర్లకు చెక్ పెట్టడం కోసమే శాకుంతలం సినిమాని ఫిబ్రవరి 17వ తేదీ విడుదలకు ఫిక్స్ చేశారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…