Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు గురించి అందరికీ సుపరిచితమే తాజాగా ఈయన నిర్మాణంలో కోలీవుడ్ హీరో విజయ్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన వరిసు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి దిల్ రాజు తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను డిస్ట్రిబ్యూటర్ గా పవన్ కళ్యాణ్ సినిమా వల్ల భారీగా నష్టపోయానని ఈయన తెలిపారు. పవన్ కళ్యాణ్ హీరోగా 2015 వ సంవత్సరంలో అజ్ఞాతవాసి సినిమా నైజాం హక్కులను తాను కొనుగోలు చేశానని తెలిపారు.
ఈ సినిమా డిజాస్టర్ కావడంతో తనకు ఫైనాన్షియల్ గా భారీ డ్యామేజ్ జరిగిందని దిల్ రాజు తెలిపారు.ఇక అదే ఏడాదిలోనే మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా హక్కులను కూడా తాను కొనుగోలు చేశానని అయితే ఈ సినిమా కూడా తనకు తీవ్రమైన నష్టాలను మిగిల్చిందని దిల్ రాజు తెలిపారు. ఈ రెండు సినిమాల కారణంగా తాను భారీగా నష్టపోయానని తెలియజేశారు.
ఈ విధంగా ఫైనాన్షియల్ గా ఈ రెండు సినిమాలు బాగా దెబ్బ కొట్టడంతో నష్టాలు వచ్చాయి.ఇక నా స్థానంలో ఇతర నిర్మాతలు ఎవరున్నా ఆత్మహత్య చేసుకునేవారు లేదా ఇండస్ట్రీ నుంచి పారిపోయే వారని ఈయన తెలిపారు. ఇక అదే ఏడాది తాను ఆరు హిట్ సినిమాలను అందుకోవడంతో ఇండస్ట్రీలో నిలబడగలిగానని ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…