Movie News

Dil Raju: నా స్థానంలో ఇంకొకరు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు… దిల్ రాజు కామెంట్స్ వైరల్!

Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు గురించి అందరికీ సుపరిచితమే తాజాగా ఈయన నిర్మాణంలో కోలీవుడ్ హీరో విజయ్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన వరిసు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి దిల్ రాజు తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను డిస్ట్రిబ్యూటర్ గా పవన్ కళ్యాణ్ సినిమా వల్ల భారీగా నష్టపోయానని ఈయన తెలిపారు. పవన్ కళ్యాణ్ హీరోగా 2015 వ సంవత్సరంలో అజ్ఞాతవాసి సినిమా నైజాం హక్కులను తాను కొనుగోలు చేశానని తెలిపారు.

ఈ సినిమా డిజాస్టర్ కావడంతో తనకు ఫైనాన్షియల్ గా భారీ డ్యామేజ్ జరిగిందని దిల్ రాజు తెలిపారు.ఇక అదే ఏడాదిలోనే మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా హక్కులను కూడా తాను కొనుగోలు చేశానని అయితే ఈ సినిమా కూడా తనకు తీవ్రమైన నష్టాలను మిగిల్చిందని దిల్ రాజు తెలిపారు. ఈ రెండు సినిమాల కారణంగా తాను భారీగా నష్టపోయానని తెలియజేశారు.

Dil Raju: ఇండస్ట్రీ నుంచి పారిపోయేవారు…


ఈ విధంగా ఫైనాన్షియల్ గా ఈ రెండు సినిమాలు బాగా దెబ్బ కొట్టడంతో నష్టాలు వచ్చాయి.ఇక నా స్థానంలో ఇతర నిర్మాతలు ఎవరున్నా ఆత్మహత్య చేసుకునేవారు లేదా ఇండస్ట్రీ నుంచి పారిపోయే వారని ఈయన తెలిపారు. ఇక అదే ఏడాది తాను ఆరు హిట్ సినిమాలను అందుకోవడంతో ఇండస్ట్రీలో నిలబడగలిగానని ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago