మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం అయిన సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
రామ్ చరణ్ కెరీర్ లో ఇది 15వ సినిమాగా, అలాగే దిల్ రాజ్ కెరిర్ లో 50వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. ఇటీవలే ఒక పాట చిత్రీకరణ కోసం పూనేకి వెళ్లిన ఈ సినిమా బృందం ఆ షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. దీపావళి తర్వాత ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలు కానుంది.
ఈ సినిమాలో సునీల్, అంజలి, జయరామ్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక మొదటి షెడ్యూల్ పూర్తవగానే రామ్ చరణ్ ముంబై కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబై విమానాశ్రయంలో కనిపించిన చరణ్ ఫోటోలు తాజాగా వైరల్ అయ్యాయి. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు,శిరిష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ను సరికొత్త రీతిలో ప్రెజంట్ చేయబోతున్నారు. శిరీష్, దిల్ రాజు తమ బ్యానర్ లో మరే సినిమాకు పెట్టినంత భారీ బడ్జెట్ తో, గ్రాండ్ స్కేల్ తో ఇండియన్ సినిమాల్లో ల్యాండ్ మార్క్ మూవీలా నిలిచిపోయేలా దిల్ రాజు శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏది ఏమైనా రామ్ చరణ్కో కోసం దిల్ రాజు పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…