మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం అయిన సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
రామ్ చరణ్ కెరీర్ లో ఇది 15వ సినిమాగా, అలాగే దిల్ రాజ్ కెరిర్ లో 50వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. ఇటీవలే ఒక పాట చిత్రీకరణ కోసం పూనేకి వెళ్లిన ఈ సినిమా బృందం ఆ షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. దీపావళి తర్వాత ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలు కానుంది.
ఈ సినిమాలో సునీల్, అంజలి, జయరామ్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక మొదటి షెడ్యూల్ పూర్తవగానే రామ్ చరణ్ ముంబై కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబై విమానాశ్రయంలో కనిపించిన చరణ్ ఫోటోలు తాజాగా వైరల్ అయ్యాయి. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు,శిరిష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ను సరికొత్త రీతిలో ప్రెజంట్ చేయబోతున్నారు. శిరీష్, దిల్ రాజు తమ బ్యానర్ లో మరే సినిమాకు పెట్టినంత భారీ బడ్జెట్ తో, గ్రాండ్ స్కేల్ తో ఇండియన్ సినిమాల్లో ల్యాండ్ మార్క్ మూవీలా నిలిచిపోయేలా దిల్ రాజు శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏది ఏమైనా రామ్ చరణ్కో కోసం దిల్ రాజు పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…