Director Gopichandh Malineni : డాన్ శీను సినిమాతో డైరెక్టర్ గా తానేంటో నిరూపించుకున్న గోపీచంద్ మలినేని తాజాగా వీర సింహా రెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రకాశం జిల్లాకు చెందిన గోపీచంద్ సినిమా మీద ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టి పలువురు డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తరువాత డైరెక్టర్ గా డాన్ శీను, బాడీ గార్డ్, పండగ చేస్కో, బలుపు, విన్నర్, క్రాక్ ఇలా సక్సెస్ ఫుల్ గా సినిమాలను తీశారు, గోపీచంద్ నేడు వీర సింహ రెడ్డి తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ సినిమా ముచ్చట్లను అలానే సోషల్ మీడియాలో తనపై వచ్చిన ట్రోల్ల్స్ గురించి మాట్లాడారు.

శృతికి ఐ లవ్ యూ చెప్పినందుకు ట్రోల్ చేశారు…
శృతి హాసన్ చాలా బాగా నా ఫ్యామిలీతో కలిసి పోయిందని, తను నా భార్యతో కూడా బాగా మాట్లాడుతూ ఉంటుందని, నా కొడుకు అంటే చాలా ఇష్టమంటూ చెప్పారు గోపీచంద్ మలినేని. అందువల్లే తనను నా ఆడపడచుగా చూస్తానని చెప్పారు. అలా నేను వీర సింహా రెడ్డి సినిమా వేడుకలో ఐ లవ్ యూ చెబితే తాను నాకు ఇండస్ట్రీలో మంచి అన్న దొరికాడు అన్న మాటలను తారుమారు చేసి ట్రోల్ చేశారంటూ చెప్పారు.

నిజానికి వేడుకలో మొదట తాను నాకు ఒక అన్న తెలుగు ఇండస్ట్రీలో దొరికాడు అని చెప్పగా నేను లవ్ యూ శృతి అని చెప్పాను కానీ దాన్ని మార్చి అలా ట్రోల్ చేసారు అంటూ తెలిపారు. ఇక తన కొడుకు సాత్విక్ ఒక టేక్ లోనే సీన్ చేసేయడం హ్యాపీగా అనిపించిందంటూ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి సారి రవితేజ తరువాత ఒక అగ్ర హీరోతో సినిమా చేసానంటూ చెప్పారు గోపీచంద్ మలినేని.



























