Director Sagar : సీనియర్ దర్శకులు విద్యా సాగర్ రెడ్డి అందరికీ డైరెక్టర్ సాగర్ గా బాగా సుపరిచితులు. మొదట ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఆ తరువాత దర్శకత్వంలోకి వచ్చిన ఈయన కృష్ణ గారితో మొదట సినిమా తీయాలని అనుకునేవారట. దాదాపు పది సంవత్సరాల పైనే సహాయ దర్శకుడిగానే పనిచేసారు. దర్శకుడిగా మంచి హిట్లందుకున్న ఈయన నిర్మాతగా సినిమా తీసి భారీ నష్టాలను చూసారు. ఇక సినిమాలను తీయకూడదని నిర్ణయించుకుని అస్త్ర సన్యాసం చేసారు.

సావిత్రి ని మోసం చేసింది వాడే…
డైరెక్టర్ సాగర్ తన సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ హీరోయిన్ దీప కు నేనంటే చాలా ఇష్టమని, నాకు పెళ్ళైన విషయం తనకు తెలియదని, నేను సినిమాలు కొంత అయ్యేవరకు ఆమెకు చెప్పలేదని అయితే ఆమె మేనేజర్ గా ఉంటూ ఆమె డేట్స్ చూసేవాడిని అంటూ తెలిపారు. ఏ సినిమా అయినా నన్ను అడిగి డేట్స్ ఇచ్చేదంటూ తెలిపారు. ఇక మహానటి సావిత్రి గురించి మాట్లాడుతూ ఆమె తప్పు చేయలేదంటూ చెప్పారు. ఆమె తప్పు చేయలేదని కాకపోతే నమ్మిన వాడు బాగా మోసం చేశాడంటూ తెలిపారు.

ఆమె ప్రభుత్వం అడిగిందని ఆమె బంగారం ఆంతా ఇచ్చేసిన వ్యక్తి, అలాంటి ఆమెను మోసం చేసిన వ్యక్తి నాకు బాగా తెలుసు అంటూ చెప్పారు. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి సావిత్రి ఇంటి గూర్ఖా వద్ద ఉంటూ సావిత్రి గారి కంట్లో పడి అలా పరిచయం పెంచుకుని ఆమెకు దగ్గరయ్యాడు. ఆమె అప్పటికే డిప్రెషన్ లో తాగుడుకు బానిస కాగా ఆమె ఆర్థిక వ్యవహారలాన్నిచూసే బాబు అనే వ్యక్తి ఆమెను ఎక్కువగా తాగనిచ్చేవాడు కాదు. అయితే సుబ్రహ్మణ్యం మెల్లగా ఆమె పంచన చేరి ఆమెతో కలిసి తాగి ఆమెను మరింత తాగేలా చేసి మత్తులో ఉన్నపుడు ఆస్తుల మీద సంతకాలు చేయించుకున్నాడు. అలా ఆమె చివరికి డబ్బు లేకుండా ఒంటరిగా మరణించారు అంటూ చెప్పారు.
































