Director Veera Shankar : తణుకులో పుట్టి పెరిగిన వీరశంకర్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి కోడిరామకృష్ణ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. ఇక ఆయన తెలుగులో తీసిన మొదటి సినిమా ‘హలో ఐ లవ్ యూ’. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా ‘గుడుంబా శంకర్’ సినిమాను అంజన ప్రొడక్షన్స్ లో తీశారు. ఇక ఈసినిమా పరాజయం తరువాత కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా ‘నమ్మ బసవ’ సినిమా తీశారు. ఇక కన్నడలో ఎలా ఆదరిస్తారు అనే విషయం మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా తెలుగు వాళ్లకు కుల పిచ్చి ఉంటుందంటూ తెలిపారు.

మనవాళ్ల కులపిచ్చి ఖండాలు దాటినా వదలరు…
కన్నడ ప్రజలు తెలుగు, తమిళ అంటూ బేధం చూపరని అందరినీ అందరిస్తారని ఎవరు ఏమిటి అని కూడా ఇతర రాష్ట్రాల వాళ్లను అడగరంటూ తెలిపారు. కర్ణాటకలో చదివే సమయంలో ఎవరూ నువ్వు ఏమిటి అని అడుగలేదు. కానీ భీమవరంలో చదవడానికి వచ్చినపుడు నీ కులమేమిటి అనే ప్రశ్న ఎక్కువగా ఎదురైంది అంటూ తెలిపారు. ఖండాలు దాటినా మన తెలుగువాళ్ళకు కులపిచ్చి మాత్రం పోలేదు అంటూ తెలిపారు.

చిత్రపురిలో దొంగలు వాళ్ళే…
సినిమా కార్మికుల కోసం ఇల్లు కట్టుకోడానికి స్థలాన్ని దానం చేసారు సీనియర్ నటులు ప్రభాకర్ రెడ్డిగారు. అయితే ఆయన సదుద్దేశంతో ఇస్తే ఇప్పడు అక్కడ మాత్రం ఆర్టిస్టులు సినిమా కార్మికులు కానివాళ్ళు స్థలాలను పొందుతున్నారనేది వాదన. ఈ విషయం పై డైరెక్టర్స్ అసోసియేషన్ తరపున వీరశంకర్ గారు మాట్లాడారు. డైరెక్షన్ అసోసియేషన్ ను ప్రక్షాళన చేసి నకిలీ సినిమా కార్మికుల పేర్లను తొలగించడం జరిగింది, అలాగే ఇతర సంఘాలు కూడా ఆ పని చేస్తే బాగుంటుందంటూ చెప్పారు. చాలా మంది నిజమైన కార్మికులకు లబ్ది చేకూరడం లేదని నకిలీ వాళ్ళు స్థలాలను దక్కించుకుంటున్నారని దీనిపై ఎవరూ మాట్లాడరని చెప్పారు. దీనిపై మా అసోసియేషన్ ఫెడరేషన్ ఇంకా కార్మిక ఫెడరేషన్స్ కలిపి ఒక అథారిటీగా ఏర్పడి ఒక నిర్ణయం తీసుకోవచ్చు కానీ అలా చేయరు. కార్మికుల విషయాల్లో మేమెందుకు కలగజేసుకోవాలని సినిమా పెద్దలు అనుకుంటున్నారు.



























