Connect with us

Featured

Shyam Singha Roy: శ్యాంసింగరాయ్ సీక్వెల్ ను పవన్ కళ్యాణ్ తో తీయాలనుకుంటున్న.. యంగ్ డైరెక్టర్..!

Shyam Singha Roy: కొత్తగా వస్తున్న యువదర్శకుల నుంచి సీనియర్ దర్శకుల దాకా పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటారు. పవన్ తో హిట్

Published

on

Shyam Singha Roy: కొత్తగా వస్తున్న యువదర్శకుల నుంచి సీనియర్ దర్శకుల దాకా పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటారు. పవన్ తో హిట్ కొడితే తమ రేంజ్.. మార్కెట్ కూడా పెరుగుతుందని భావిస్తుంటారు. అలాంటి డైరెక్టర్ల జాబితాలో ప్రస్తుతం శ్యాంసింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కూడా చేరారు. 

Shyam Singha Roy: శ్యాంసింగరాయ్ సీక్వెల్ ను పవన్ కళ్యాణ్ తో తీయాలనుకుంటున్న.. యంగ్ డైరెక్టర్..!
Shyam Singha Roy: శ్యాంసింగరాయ్ సీక్వెల్ ను పవన్ కళ్యాణ్ తో తీయాలనుకుంటున్న.. యంగ్ డైరెక్టర్..!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. చాలా రోజుల గ్యాప్ తరువాత వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వచ్చిన వకీల్ సాబ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను కూడా అందుకుంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. రానా కాంబినేషన్ లో వచ్చిన ‘భీమ్లా నాయక్’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Shyam Singha Roy: శ్యాంసింగరాయ్ సీక్వెల్ ను పవన్ కళ్యాణ్ తో తీయాలనుకుంటున్న.. యంగ్ డైరెక్టర్..!
Shyam Singha Roy: శ్యాంసింగరాయ్ సీక్వెల్ ను పవన్ కళ్యాణ్ తో తీయాలనుకుంటున్న.. యంగ్ డైరెక్టర్..!

మళయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషీయుమ్ సినిమాకు రీమేక్ గా భీమ్లానాయక్ తెరకెక్కింది. దీని తర్వాత మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘హరిహర వీరమల్లు’లో పవన్ నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమాగా హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. ఇలా చూస్తే దాదాపు 2023 వరకు పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఏ సినిమా ఒప్పుకున్నా.. ఆ తరువాతే ఉండనుంది.

మనసులో మాట బయటపెట్టిన యంగ్ డైరెక్టర్:

టాక్సీవాలా, శ్యాంసింగరాయ్ తో వరస హిట్లు అందుకున్న డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తన మనసులో మాట బయటపెట్టాడు. శ్యాంసింగరాయ్ ఇచ్చిన హిట్ కిక్ లో రాహుల్ సాంకృత్యాన్ ఉన్నారు. అయితే తాను శ్యాంసింగరాయ్ సీక్వెల్ మూవీని పవన్ కళ్యాణ్ తో తీయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. సాధారణంగా ఓ హీరో నటించిన సినిమా సీక్వెల్ కు మరో హీరో నటించడానికి ఇష్టపడరు. అయితే రాహుల్ సాంకృత్యాన్ మాత్రం తన శ్యాంసింగరాయ్ సీక్వెల్ సినిమాను పవన్ తో తీయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. శ్యాంసింగరాయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన కోరికను బయటపెట్టాడు. అయితే ఈ యంగ్ డైరెక్టర్ కోరికపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

Advertisement

Featured

Lahari: ఖరీదైన కారును కొన్న బుల్లితెర నటి లహరి.. కారు ధర ఎంతో తెలుసా?

Published

on

Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

VN Adithya: డల్లాస్ లో డైరెక్టర్ వి. ఎన్ ఆదిత్య కొత్త సినిమా… ఆదరణ మామూలుగా లేదుగా?

Published

on

VN Adithya: వి.ఎన్ ఆదిత్య పరిచయం అవసరం లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనసంతా నువ్వే ,నేనున్నాను, శ్రీరామ్ వంటి ఫీల్ గుడ్ లవ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరో కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పీపుల్ మీడియా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అమెరికాలోని డల్లాస్ లో షూటింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా ఈ సినిమా కార్యరూపం దాల్చనుంది.

ఈ క్రమంలోనే జులై 7వ తేదీ ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో
లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో తన కొత్త సినిమా గురించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా నిర్మాణం కూడా డల్లాస్‌లో జరగనుందని తెలుస్తోంది.
తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది.

Advertisement

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Suma -Siddharth: యాంకర్ సుమ బుజం పై చేతులు వేసి రచ్చ చేసిన సిద్ధార్థ్.. షాక్ లో నెటిజన్స్!

Published

on

Suma -Siddharth: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుమ ఇటీవల కాలంలో వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ సుమ పట్ల వ్యవహరించిన తీరుపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. వేదికపై సుమ మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు మేమిద్దరం స్టేజ్ పై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తున్నామని అందరూ అనేవాళ్ళు.

ఇప్పుడు అంతకుమించి ఓవర్ చేస్తాము అంటూ సుమ భుజంపై చేతులు వేస్తూ కామెంట్స్ చేశారు. సుమతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు. ఇప్పుడు భారతీయుడు 2 అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

మన వయసు పెరగదు..
ఇలా సిద్ధార్థ్ మాట్లాడటంతో వెంటనే సుమా మాట్లాడుతూ… ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి వయసు ఎవరు పసిగట్టలేరు అందరి వయసు పెరుగుతూ ఉన్న మన వయసు మాత్రం అక్కడే ఆగిపోయింది అంటూ సుమా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి సుమ పట్ల సిద్ధార్థ్ వ్యవహార శైలి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!