Panchatantra Kathalu: పంచతంత్ర కథలు ట్రైలర్ రిలీజ్.. మీరు చూశారా?
Panchatantra Kathalu: దర్శకుడు గంగనమోని శేఖర్ దర్శకత్వంలో డి.మధు నిర్మిస్తున్న తాజా చిత్రం పంచతంత్ర కథలు. ఈ సినిమాను మధు క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాతో దర్శకుడు గంగను మోడీ శేఖర్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాలో నోయెల్, do
నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ లతో పాటు పలువురు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఐదు వేర్వేరు కథల ఆంథాలజీ కావడంతో ఈ సినిమాకు పంచతంత్ర కథలు అనే టైటిల్ ను పెట్టారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఈ సినిమా నుంచి మోతెవరి అనే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. కాగా ఈ పాటకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ సంగీత దర్శకుడు అయిన ఎంఎం కీరవాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగానమును శేఖర్ దర్శకత్వంలో తనకి ఎక్కబోతున్న ఈ సినిమా ఐదు వేరువేరు కథలు అలాగే ఐదు వేరు వేరు జోనర్లతో రావడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని తెలిపారు.
అదేవిధంగా ట్రైలర్ చాలా బాగుందని, ఈ సినిమాలో క్యారెక్టరై జేషన్స్ కూడా కొత్త కొత్తగా ఉన్నాయి అని చెప్పుకొచ్చారు ఎం ఎం కీరవాణి. ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాను అని తెలిపారు. కాగా ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని యూఏ సర్టిఫికెట్ను కూడా పొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సెన్సార్ సభ్యులు చిత్ర బృందాన్ని అభినందించారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…