Health News

ఎండాకాలంలో చల్ల నీటితో స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

వేసవి కాలం ప్రారంభం అవడంతో మండే ఎండలతోపాటు అనేక సమస్యలను వెంట తీసుకువస్తుంది. ముఖ్యంగా బయటి ప్రదేశాల్లో పనిచేసేవారు చాలా ఇబ్బంది పడాల్సివస్తుంది. వేడి వాతావరణం కారణంగా శరీరంలోని తేమ ఆవిరై డీ-హైడ్రేషన్ కు గురవుతారు. డీహైడ్రేషన్ నుంచి విముక్తి పొందడం కోసం ఎన్నో శీతల పానీయాలను తీసుకుంటారు.వీటిని తీసుకోవడం వల్ల దాహం తీరడం ఏమో కానీ, తర్వాత అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ప్రకృతి సిద్ధంగా లభించే కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పంచదార, ఉప్పు కలిపిన నీటిని తాగితే వెంటనే ఉపసమనం లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగిపోవటం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. శరీర ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల లేదా అంత కన్నా ఎక్కువ ఉండటాన్ని వడదెబ్బతగలడం అంటారు. దాంతో శరీరం డీ-హైడ్రేషన్ కి గురవుతుంది. ఈ సమయంలో తలనొప్పి, వాంతులు, అలసట, బలహీనంగా అవటం, కండరాల తిమ్మిరులు మరియు కళ్ళు తిరగటం లక్షణాలుగా కనపడతాయి.హార్ట్ స్ట్రోక్ కి కూడా కారణమయ్యే అవకాశం ఉంది.

వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలు:

  • వేసవిలో మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి రెండుసార్లు స్నానం చేయడం మంచిది. మరి చల్లగా ఉన్న నీటిని స్నానానికి వాడితే హఠాత్తుగా శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది. కావున స్నానానికి గోరు వెచ్చని నీటి వాడడం మంచిది.
  • వేసవిలో మనం సహజంగా రోజుకు 7-8 లీటర్ల నీళ్లు తాగడం మంచిది అలాగే ప్రకృతి సిద్ధంగా దొరికే తాజా పళ్ళ రసాలను, మజ్జిగ తీసుకోవడం మరీ మంచిది.
  • వేసవిలో ఎక్కువగా సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. కావున సాధ్యమైనంత వరకు ఉదయం పది గంటలలోపు సాయంత్రం ఐదు తర్వాత బయటికి వెళ్లడం మంచిది ఇది.

*వేసవిలో ముఖ్యంగా జంక్ ఫుడ్, ఆల్కహాల్, అధిక మసాలా ఉన్న ఆహారం, కెఫీన్ శరీరంలో వేడికి కారణమవుతాయి. కాబట్టి వీటికి సాధ్యమైనంతవరకు దూరంగా ఉండాలి

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

4 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

5 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

6 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

7 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

7 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

7 hours ago