ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరికీ పీఎఫ్ అవకాశం ఉంటుంది. వారి జీతం నుంచి 12 శాతం వరకు కట్ అవుతుంది. కొన్ని కంపెనీలు ఇలాంటి ఫెసిలిటీని కల్పించాయి. మరికొన్ని కంపెనీలు పీఎఫ్ అవకాశం కల్పించలేదు. అయితే పీఎఫ్ ఉన్న ఉద్యోగులకు ఇక్కడ ఇదొక శుభవార్త అనే చెప్పాలి.
మీరు పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవాలని భావించేవాళ్లకు .. ఇక మీదట గంటలోనే పీఎఫ్ డబ్బులు పొందే వెసులుబాటు కల్పించింది పీఎఫ్. మెడికల్ ఎమర్జెన్సీ కింద వెంటనే పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చని తెలిపారు. ఇలా మెడికల్ ఎమర్జెన్సీ కింద రూ.లక్ష వరకు డ్రా చేసుకోవచ్చని తెలిపారు. అంతక ముందు 3 నుంచి 7 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు దీనిని ఒక గంటకు కుదించారు. ఇంకా దీనికి ఎలాంటి మెడికల్ బిల్లులను సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఈ డబ్బులను విత్ డ్రా చేసుకోవాలంటే.. ముందుగా అధికారిక వెబ్ సైట్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ కి వెళ్లి యూఏఎన్ నంబర్ , పాస్ వర్ట్ ను మరియు క్యాప్చాను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పీఎఫ్ విత్ డ్రా అనే ఆప్షన్ ను క్లిక్ ఇచ్చిన తర్వాత మరో పేజి ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అంకెలను ఎంటర్ చేయాలి. వెరిఫై చేసుకోవాలి. తర్వాత పీఎఫ్ అడ్వాన్స్ సెలెక్ట్ చేయాలి. కారణం తెలియజేయాలి. స్కాన్ చేసిన చెక్ అప్లోడ్ చేయాలి. ఆధార్ ఓటీపీపై క్లిక్ చేసి ఓకే చేయాలి. దీంతో మీ క్లెయిమ్ పూర్తయినట్లే. తర్వాత గంటలోనే మీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయిపోతాయి.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…