ప్రస్తుతం వర్షాలకాలం నుంచి చలికాలానికి వెళ్తున్నాం. అయితే వాతావరణం ఈ రెండు కాలాల్లో చల్లగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వేడివేడిగా ఎవరికైనా తినాలని అనిపిస్తుంటుంది. అయితే ఇందులో వేడిగా పల్లీలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు అంతే కాకుండా.. ఈ పల్లీల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. పల్లీల్లో బోలెడన్ని పోషకాలు దాగివున్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు.
పల్లీల్లో మోనోశాచురేటెడ్ కొవ్వుల కారణంగా వీటిని మోతాదుకు మించకుండా తినడం వల్ల గుండెజబ్బులను ఇరవై శాతం వరకూ తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం 100 గ్రాముల పల్లీలలో 567 క్యాలోరీలు ఉంటాయి. వీటిని రోజుకు ఒక కప్పు తీసుకుంటే.. ఎలాంటి జబ్బులు మన జోలికి కూడా రావని నిపుణులు చెబుతున్నారు.
అయితే ముఖ్యంగా పల్లీలు మతిమరుపు సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగపడుతాయట. శరీరంలో అన్ని జీవక్రియలను నియంత్రించడానికి అవసరం అయ్యే విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా కలిగి ఉన్నాయి. వేరుశెనగలో విటమిన్ బి పుష్కలంగా ఉండి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి మరియు జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
పల్లీలలో ఉండే అమినో యాసిడ్స్ శరీరంలో నిల్వ ఉన్న చెడు కొవ్వులను కరిగించి మంచి కొవ్వు నిల్వ ఉండేలా చేస్తుంది. పల్లీల లో కాల్షియం కూడా అధికంగా లభించడంతో ఎముకలు బాగా దృఢపడతాయి. అంతేకాకుండా వీటిని పెరిగే పిల్లలకూ, గర్భిణులకూ, పాలిచ్చే తల్లులకూ ఎంతో మంచివి. వేయించిన తాజా గింజల్ని బెల్లంతో కలిపి ఉండలు చేసుకుని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. అలాగే పల్లీలు నానబెట్టి ప్రతిరోజు కొంచెం తీసుకోవడం వలన గ్యాస్ సమస్యను కూడా ఎదుర్కోవచ్చంటూ నిపుణులు చెబుతున్నారు.
వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…
అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…