సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగువారందరికీ సుపరిచితుడైన సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు రత్న కుమార్ ఈరోజు గురువారం ఉదయం గుండెపోటుతో కన్నుమూసారు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి హాస్పిటల్లో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.

అయితే ఇదివరకే గంటశాల రత్న కుమ్మర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది, రెండు రోజుల క్రితమే కోవిడ్ నెగిటివ్ వచ్చిందని సమాచారం. అయితే గత కొంతకాలంగా అయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో రత్నకుమార్ ఆకస్మిక మరణంతో ఘంటసాల కుటుంబంతో పాటూ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. రత్నకుమార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు , సావిత్రి దంపతుల రెండో కుమారుడే రత్న కుమార్. ఈయన ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నారు. తెలుగు,తమిళం తో పాటూ వివిధ భాషల్లో కొన్ని వేల సినిమాలకు, సీరియల్స్కు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు.




























