కొన్నిసార్లు చెడులోను మంచే జరుగుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధనను చూస్తే ఈ సామెత నిజమేనని నమ్మాలనిపిస్తోంది. ఎందుకంటే బ్రెజిల్ లోని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఎవరైతే డెంగ్యూ బారిన పడి కోలుకుంటారో వారికి కరోనా సోకే ముప్పు తక్కువని తేల్చారు. వినడానికి కొంత విచిత్రంగానే శాస్త్రవేత్తలు చెబుతున్న కారణాలు వింటే నిజమేనని నమ్మాల్సి వస్తోంది.
దోమ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులలో డెంగ్యూ ప్రమాదకరమైనది. డెంగ్యూ బారిన పడి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా మనం చూశాం. ఎవరైతే డెంగ్యూ బారిన పడతారో వాళ్ల శరీరంలో రక్త కణాలు వేగంగా తగ్గుతాయి. డెంగ్యూ బారిన పడ్డ వారు శారీరకంగా బలహీనపడటంతో పాటు ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. అయితే డెంగ్యూ నుంచి కోలుకున్న తరువాత వారిలో మరోసారి డెంగ్యూ బారిన పడకుండా యాంటీబాడీలు తయారవుతాయి.
అలా డెంగ్యూ ద్వారా కోలుకున్న వారిలో ఉండే యాంటీబాడీలే వారు కరోనా బారిన పడకుండా ఉండటానికి కారణమవుతున్నాయి. మిగుల్ నికోలెసిన్ అనే డ్యూక్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఈ విషయాలను వెల్లడించారు. త్వరలో శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనానికి సంబంధించిన నివేదిక ప్రచురితం కానుంది. నికోలేసిస్ మాట్లాడుతూ 2019లో డెంగ్యూ ప్రబలిన ప్రాంతాల్లో తక్కువగా కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయని వెల్లడించారు.
శరీరంలోని యాంటీబాడీలు డెంగ్యూకు, కరోనా వైరస్ కు ఒకే విధంగా స్పందిస్తున్నాయని ఇమ్యూనిటీ విషయంలో రెండూ ఒకే విధంగా ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యామాని చెప్పారు. డెంగ్యూ రోగుల కోసం వాడే మందులను కరోనా రోగులపై ప్రయోగిస్తే మంచి ఫలితాలు ఉండవచ్చని.. బ్రెజిల్ లో గతేడాది డెంగ్యూ విజృంభించిన రాష్ట్రాల్లో ఆలస్యంగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయని అన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…