General News

డెంగ్యూ వ్యాధి బారిన పడ్డ వాళ్లకు శుభవార్త!

కొన్నిసార్లు చెడులోను మంచే జరుగుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధనను చూస్తే ఈ సామెత నిజమేనని నమ్మాలనిపిస్తోంది. ఎందుకంటే బ్రెజిల్ లోని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఎవరైతే డెంగ్యూ బారిన పడి కోలుకుంటారో వారికి కరోనా సోకే ముప్పు తక్కువని తేల్చారు. వినడానికి కొంత విచిత్రంగానే శాస్త్రవేత్తలు చెబుతున్న కారణాలు వింటే నిజమేనని నమ్మాల్సి వస్తోంది.

దోమ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులలో డెంగ్యూ ప్రమాదకరమైనది. డెంగ్యూ బారిన పడి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా మనం చూశాం. ఎవరైతే డెంగ్యూ బారిన పడతారో వాళ్ల శరీరంలో రక్త కణాలు వేగంగా తగ్గుతాయి. డెంగ్యూ బారిన పడ్డ వారు శారీరకంగా బలహీనపడటంతో పాటు ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. అయితే డెంగ్యూ నుంచి కోలుకున్న తరువాత వారిలో మరోసారి డెంగ్యూ బారిన పడకుండా యాంటీబాడీలు తయారవుతాయి.

అలా డెంగ్యూ ద్వారా కోలుకున్న వారిలో ఉండే యాంటీబాడీలే వారు కరోనా బారిన పడకుండా ఉండటానికి కారణమవుతున్నాయి. మిగుల్ నికోలెసిన్ అనే డ్యూక్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఈ విషయాలను వెల్లడించారు. త్వరలో శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనానికి సంబంధించిన నివేదిక ప్రచురితం కానుంది. నికోలేసిస్ మాట్లాడుతూ 2019లో డెంగ్యూ ప్రబలిన ప్రాంతాల్లో తక్కువగా కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయని వెల్లడించారు.

శరీరంలోని యాంటీబాడీలు డెంగ్యూకు, కరోనా వైరస్ కు ఒకే విధంగా స్పందిస్తున్నాయని ఇమ్యూనిటీ విషయంలో రెండూ ఒకే విధంగా ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యామాని చెప్పారు. డెంగ్యూ రోగుల కోసం వాడే మందులను కరోనా రోగులపై ప్రయోగిస్తే మంచి ఫలితాలు ఉండవచ్చని.. బ్రెజిల్ లో గతేడాది డెంగ్యూ విజృంభించిన రాష్ట్రాల్లో ఆలస్యంగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయని అన్నారు.

telugudesk

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

2 days ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

2 days ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

2 days ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

2 days ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

2 days ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

2 days ago