Featured

రెప్ప పాటులో నేలమట్టం అయిన వాటర్ ట్యాంక్.. తప్పిన ప్రమాదం..!

అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయని మనం అస్సలు ఊహించి ఉండం. అవి మన రెప్పపాటు కాలంలో జరిగిపోతుంటాయి. ఇలంటిదే ఓ ఘటన జరిగింది. అదేంటంటే.. పురాతన కాలంలో కట్టిన వాటర్ ట్యాంక్ నీటి సరఫరాకు ఉపయోగిస్తున్నారు. ఆ ట్యాంక్ ద్వారానే ఆ గ్రామానికి నీటి సరఫరా జరుగుతుంది. అయితే ఇప్పడు అది శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. దీనిని అధికారులు గుర్తించలేకపోయారు.

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. చూస్తుండగానే ఆ శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా నేల మట్టం అయ్యింది. అదృష్టం ఎంటంటే ఆ వాటర్ ట్యాంకు కూలిన సమయంలో ఎవరూ అక్కడ లేరు. దీంతో పెను ప్రమాదం తృటిలో తప్పినట్లయింది. అయితే ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. ఈ సీసీ కెమెరాలో రాకార్డు అయిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది తెగ వైరల్ గా మారింది.

ఆ వాటర్ ట్యాంక్ అంతా కిందపడిపోవడంతో నీళ్లన్నీ ఆ సమీపాన ఉన్న గ్రామస్తుల ఇళ్ల వరకు చేరాయి. ఆ ప్రాంతమంతా జలమయం అయిపోయింది. అయితే.. అధికారుల నిర్లక్ష్యంతోనే ట్యాంకు నేలమట్టమైందని, పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. 1.5 లక్షల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ 40 ఏళ్ల క్రితం నాటిదని గ్రామస్థులు వెల్లడించారు. ఉదయం.. సాయంత్రం సమయంలో ఎక్కువగా నీళ్ల కోసం ట్యాంక్ వద్దకు వెళ్తామని.. మిగతా సమయంలో అక్కడ వెళ్లమని.. అయితే మధ్యాహ్నం సమయంలో ఇలా జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని గ్రామస్తులు తెలిపారు.

ఈ ఘటన గుజరాత్‌ జునాఘడ్‌లోని కేశోద్ ప్రాంతం ఖీర్సారా గ్రామంలో చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా 2019 లో ఇలానే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో వాటర్ ట్యాంక్ కూలి ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. అలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకపోడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రోజా రీ-ఎంట్రీ రెడీ.. ‘ఫ్యామిలీ అసెంబ్లీ’తో బుల్లితెరపై సందడి

సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…

5 minutes ago

తమన్నా పిటిషన్‌కు షాక్.. హైకోర్టు కీలక తీర్పు

ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…

8 minutes ago

పురుషుల కోసం కొత్త గర్భనిరోధక మాత్ర.. వైద్య రంగంలో సంచలనం!

ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…

16 minutes ago

పరగడుపున పండ్లు తినొచ్చా? నిపుణుల స్పష్టమైన సమాధానం!

ఉదయం పరగడుపున పండ్లు తినాలా లేదా అనే సందేహం చాలా మందిలో కనిపిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖాళీ…

46 minutes ago

ఆధ్యాత్మిక యాత్రకు బెస్ట్ డెస్టినేషన్.. కొండల మధ్య భక్తి క్షేత్రాలు.. తప్పక చూడాల్సిన దేవాలయాలు!

ఆంధ్రప్రదేశ్‌లో ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానాన్ని సంపాదించిన పుణ్యక్షేత్రాల్లో విజయ కీళాద్రి ఆలయాలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. వివిధ జిల్లాల్లో విస్తరించి…

1 hour ago

తాతను ఆటపట్టించిన మనవడు.. మోహన్‌బాబు క్యూట్ రియాక్షన్ వైరల్

తెలుగు సినీ రంగంలో క్రమశిక్షణ, గంభీరమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచే మంచు మోహన్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్…

1 hour ago