సాధారణంగా మనం ప్రతి రోజూ ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగనిదే మన రోజువారీ పనులను ప్రారంభించము.ఒక కప్పు కాఫీ తాగడం వల్ల మన శరీరంలోని నాడీ వ్యవస్థ ఎంతో చురుగ్గా పని చేయడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలోనే రోజంతా ఎంతో హుషారుగా పనులు చేసుకోగలుగుతాం. ఈ విధంగా ఒక కప్పు కాఫీ తాగటం వల్ల మనం చురుగ్గా ఉండటానికి గల కారణం కాఫీలో అధికభాగం కెఫిన్ అనే పదార్థం ఉండటం వల్ల మనల్ని ఎంతో హుషారుగా చేస్తుంది.
ఈ క్రమంలోనే కొందరు కాఫీలు ఆహార పదార్థాలను తక్కువగా తీసుకుంటూ ఎక్కువగా కాఫీ తాగుతూ ఉంటారు.కాఫీ తాగడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కానీ అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రోజు అధిక మొత్తంలో కాఫీ తీసుకోవడం వల్ల మన శరీరంలో అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది. కనుక ప్రతిరోజూ కేవలం ఒక మనిషి 400 మిల్లీ గ్రాముల కాఫీ మాత్రమే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రతి రోజు ఒక మనిషి 400 మిల్లీ గ్రాములు అంటే సుమారు నాలుగు కప్పుల కాఫీ మాత్రమే సాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కాఫీ అంటే ఇష్టం ఉండేవారు డీకెఫినేటెడ్ కాఫీ కంటే కెఫినేటెడ్ కాఫీ తాగడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. కెఫినేటెడ్ కాఫీలో కెఫిన్ తక్కువగా ఉంటుంది. రుచితో పోలిస్తే డీకెఫినేటెడ్ కాఫీ, కెఫినేటెడ్ కాఫీ సమానంగా ఉన్నప్పటికీ డీకెఫినేటెడ్ కాఫీ అధిక కెఫిన్ కలిగి ఉంటుందని నిపుణులు తెలియజేశారు.
ఇక గర్భం దాల్చిన మహిళలు పాలిచ్చే తల్లులు ప్రతిరోజు కేవలం 200 మిల్లీ గ్రాముల మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విధంగా ఇన్స్టెంట్ కాఫీని రోజుకు అధికమొత్తంలో తీసుకోవటంవల్ల అధిక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తీవ్రమైన తలనొప్పి, గుండె పనితీరు మందగించడం, జీర్ణక్రియ సమస్యలు, కండరాల నొప్పి వంటి వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి కనుక వీలైనంతవరకు రోజుకు నాలుగు కప్పుల కాఫీ మాత్రమే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…