ఈ టెక్నాలజీ యుగంలో.. ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లలోనూ అనేక మార్పులు వచ్చాయి. చాలా మంది తమ ఆరోగ్యం పై అధిక మొత్తంలో శ్రద్ధ చూపడం లేదు. సమయానికి అన్నం తినకపోవడం.. వేళకు నిద్ర పోవడం లేదు. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నాడు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఇంట్లోనే ఉండి పనులు చేసుకోవాల్సి వస్తుంది.
దీంతో దొరికిందల్లా పక్కన పెట్టుకొని మరీ లాగేస్తున్నాడు. దీంతో ఉబకాయరాయుళ్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. అయితే చాలామంది తమ శరీర రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి అనేక రకాల ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. అయితే, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు.. శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలను, విటమిన్లను అందించే వాటిలో పుట్టగొడుగులు ప్రత్యేకంగా ఉంటాయి.
పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగులు అనేవి శిలీంద్రాలు. ఈ పుట్టగొడుగులను మనం సాధారణంగా కుళ్లిన పదర్ధాలు ఉన్న చోట చోడొచ్చు. అక్కడే ఎక్కువగా పెరుగుతాయి. అయితే కుళ్లిన పదర్థాలపై పెరుగుతున్న ఈ పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివేనా.. అనే సందేహం కూడా చాలమందికి వచ్చే ఉంటుంది. కానీ ఇవి తినడం వల్ల ఎలాంటి రోగాలు రావని వైద్యనిపుణులు కూడా స్పష్టం చేశారు.
అనేక సంవత్సరాలు ఈ వైవిధ్యమైన ఆహారం పై ఎన్నో వైద్య పరిశోధనలు జరిగాయి. ఎన్నో పోషక విలువలు కలిగి క్రొవ్వు మరియు పిండి పద్ధారం తక్కువగా ఉండటం, ముఖ్యంగా మాంసకృతులు అధికంగా ఉండటం వలన పోషకాహారలోపంతో బాధపడుతున్న మహిళలకు, చిన్న పిల్లలకు ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఇదొక ప్రత్యామ్న ఆహారంగా సూచిస్తున్నారు. ఉదర సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్కు చక్కగా పనిచేస్తుంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…