ప్రస్తుతం వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ వర్షాల కారణంగా కుంటలు, చెరువులు నిండిపోయి పొంగి పారుతున్నాయి. ఈ నేపథ్యంలో జాక్రాన్ పల్లి మండలం చింతలూరులో భారీ వర్షాలకు ఆ ఊరి చెరువు అలుగు ఉప్పొంగుతోంది.
చెరువు నిండి భారీగా మత్తడి దూకుతోంది. అయితే ఆ చెరువు పక్కనే ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించి కోళ్ల ఫాం ఉంది. ఇది ఆ నీటి ప్రవాహానికి కొట్టకుపోయింది. దీంతో అందులో ఉండే కోళ్లు ఆ పొలాల్లోకి వెళ్లి కొట్టుకుపోయాయి. అక్కడ పొలాలు అన్నీ నీట మునిగిపోయాయి. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. గుంపులు గుంపులుగా ఆ ప్రదేశానికి చేరుకున్నారు.
ఒక్కొక్క వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా డజన్ల కొద్ది కోళ్లను ఇంటికి పట్టుకొని వెళ్లారు. దీంతో చింతలూరు గ్రామస్తులు కోడి కూరతో సంతోషంగా దావత్ చేసుకుంటున్నారు. కిలోల చొప్పున కాకుండా ఏకంగా డజన్ల కొద్ది కోళ్లను పట్టుకెళ్లి పండగ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలియడంతో ఆ గ్రామ చుట్టు పక్కల గ్రామస్తులు కూడా ఆ ప్రదేశానికి చేరుకొని కోళ్ల కోసం వెతకడం మొదలుపెట్టారు. అయితే బాధితుడు ప్రదీప్ రెడ్డి మాత్రం తమను ఆదుకోవాలని.. ఆ వరద ప్రవాహానికి తీవ్రంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…