ప్రస్తుతం వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ వర్షాల కారణంగా కుంటలు, చెరువులు నిండిపోయి పొంగి పారుతున్నాయి. ఈ నేపథ్యంలో జాక్రాన్ పల్లి మండలం చింతలూరులో భారీ వర్షాలకు ఆ ఊరి చెరువు అలుగు ఉప్పొంగుతోంది.
చెరువు నిండి భారీగా మత్తడి దూకుతోంది. అయితే ఆ చెరువు పక్కనే ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించి కోళ్ల ఫాం ఉంది. ఇది ఆ నీటి ప్రవాహానికి కొట్టకుపోయింది. దీంతో అందులో ఉండే కోళ్లు ఆ పొలాల్లోకి వెళ్లి కొట్టుకుపోయాయి. అక్కడ పొలాలు అన్నీ నీట మునిగిపోయాయి. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. గుంపులు గుంపులుగా ఆ ప్రదేశానికి చేరుకున్నారు.
ఒక్కొక్క వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా డజన్ల కొద్ది కోళ్లను ఇంటికి పట్టుకొని వెళ్లారు. దీంతో చింతలూరు గ్రామస్తులు కోడి కూరతో సంతోషంగా దావత్ చేసుకుంటున్నారు. కిలోల చొప్పున కాకుండా ఏకంగా డజన్ల కొద్ది కోళ్లను పట్టుకెళ్లి పండగ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలియడంతో ఆ గ్రామ చుట్టు పక్కల గ్రామస్తులు కూడా ఆ ప్రదేశానికి చేరుకొని కోళ్ల కోసం వెతకడం మొదలుపెట్టారు. అయితే బాధితుడు ప్రదీప్ రెడ్డి మాత్రం తమను ఆదుకోవాలని.. ఆ వరద ప్రవాహానికి తీవ్రంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…