పోలీస్టేషన్ లోని జైలుకు వెళ్లాలంటే ఎవరైనా భయపడతారు. ఆ ఎఫెక్ట్ పల్లెటూరు వాళ్లకు అయితే జీవితాంతం మర్చిపోరు. అయితే ఓ వ్యక్తి దొంగతనాలకు అలవాటు పడి జైలు కెళ్లడం అలవాటు అయిపోయింది. దొంగతనం చేయడం పోలీసులకు దొరికిపోయి జైలుకెళ్లడం మనోడికి అలవాడు. అతడు తన చదువును మధ్యలోనే ఆపేశాడు. దొంగ కళను మాత్రం కొనసాగించాడు.

ఇలా చోరీలు చేసి చేసి అతడికి బోర్ కొట్టిందో ఏమో.. గానీ మరో అవతారమెత్తాడు. ఇప్పుడు తన చూపు అంతా సోషల్ మీడియాలో పడింది. ఫేస్ బుక్, ఇన్ స్టా మరియు ట్విట్టర్ లల్లో అందమైన అమ్మాయిల పేరుతో ఫేక్ ఖాతాను తెరుస్తాడు. తర్వాత అమ్మాయిలను టార్గెట్ చేసి.. ముగ్గులోకి దించుతాడు. వాళ్లతో ప్రేమలో పడినట్టు నటించి న్యూడ్ వీడియోలు సంపాదిస్తాడు. వీటిని అడ్డుపెట్టుకొని వారిని బెదిరించి అందినకాడికి దోచుకుంటున్నాడు.
చివరకు పోలీసులకు చిక్కి మళ్లీ జైలు బాట పట్టాడు. ఇలా స్మార్ట్ గా దోచుకుంటున్న వ్యక్తిది ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ప్రొద్దటూరు. ఇతని పేరు ప్రసన్నకుమార్. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో చదువు మానేశాడు. ఆ తర్వాత జల్సాల కోసం దొంగగా మారాడు. 2017లో చైన్ స్నాచింగ్, తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు.
రెండు సంవత్సరాలు జైలు గడిపిన తర్వాత 2019లో బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇలా జైలు నుంచి బయటకు వచ్చి తన రూటు మార్చేశాడు. షేర్ చాట్ లో పరిచమైన శ్రీనివాస్ అనే వ్యక్తికి హైదరాబాద్ లోని సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు. దీంతో అతడిని పోలీసులు పట్టుకొని విచారించగా విషయాలు అన్నీ బయటకు వచ్చాయి. ఇలా అతడు తెలంగాణ, ఏపీలో 400 మంది అమ్మాయిలు, మహిళలను బెదిరించినట్లు తలిసింది.
































