లాక్ డౌన్ సమయంలో పెళ్లిపీటలెక్కింది మరో హీరోయిన్. మొన్ననే హీరోయిన్ ప్రణీత సైలెంట్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఈలోపే మరో హీరోయిన్ యామీ గౌతమ్ వివాహం చేసుకుంది. హీరోయిన్ యామి గౌతం బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యను పెళ్లి చేసుకుని, ఏడడుగులు నడిచింది. కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నేడు(శుక్రవారం) వీరిద్దరి పెళ్లి జరిగింది.
ఈ విషయాన్ని యామీ గౌతమ్ స్వయంగా తన సోషల్ మీడియా హ్యండిల్స్ ద్వారా అభిమానులతో పంచుకుంది. మేము పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టామంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది. అయితే, పెళ్లికొడుకు ఆదిత్య మరెవరో కాదు, ‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ డైరెక్టర్.. ప్రస్తుతం ఇతడు విక్కీ కౌశల్ హీరోగా ‘ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ సినిమా తీస్తున్నాడు. ఇక యామి గౌతమ్ తెలుగులో నితిన్ సరసన ‘కొరియర్ బాయ్ కల్యాణ్’లో నటించింది. అంతకంటే ముందు మరో మూడు సినిమాలు నువ్విలా, గౌరవం, యుద్ధం వంటి చిత్రాల్లో కనిపించింది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…