లాక్ డౌన్ సమయంలో పెళ్లిపీటలెక్కింది మరో హీరోయిన్. మొన్ననే హీరోయిన్ ప్రణీత సైలెంట్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఈలోపే మరో హీరోయిన్ యామీ గౌతమ్ వివాహం చేసుకుంది. హీరోయిన్ యామి గౌతం బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యను పెళ్లి చేసుకుని, ఏడడుగులు నడిచింది. కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నేడు(శుక్రవారం) వీరిద్దరి పెళ్లి జరిగింది.

ఈ విషయాన్ని యామీ గౌతమ్ స్వయంగా తన సోషల్ మీడియా హ్యండిల్స్ ద్వారా అభిమానులతో పంచుకుంది. మేము పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టామంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది. అయితే, పెళ్లికొడుకు ఆదిత్య మరెవరో కాదు, ‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ డైరెక్టర్.. ప్రస్తుతం ఇతడు విక్కీ కౌశల్ హీరోగా ‘ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ సినిమా తీస్తున్నాడు. ఇక యామి గౌతమ్ తెలుగులో నితిన్ సరసన ‘కొరియర్ బాయ్ కల్యాణ్’లో నటించింది. అంతకంటే ముందు మరో మూడు సినిమాలు నువ్విలా, గౌరవం, యుద్ధం వంటి చిత్రాల్లో కనిపించింది.



























