రెండవ దశ కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ ప్రభావం సినిమా రంగంపై పడటంతో ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వాలు థియేటర్లను మూసివేయాలని ఆదేశించాయి. అదేవిధంగా కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గేవరకు సినిమా షూటింగ్ వాయిదా వేసుకొని హీరోలు మరోసారి ఇంటికే పరిమితమయ్యారు.
ఈ క్రమంలోనే హీరో నిఖిల్ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ ఉదృతి తగ్గేవరకు తమ కుటుంబం మొత్తం సెల్ఫ్ లాక్డౌన్లోకి వెళ్తున్నట్లు ప్రకటించాడు. నిఖిల్ ప్రస్తుతం ‘18 పేజెస్’, ‘కార్తీకేయ-2’ చిత్రాలలో నటిస్తుండగా కరోనా ప్రభావం వల్ల ఆ సినిమాలు వాయిదా పడ్డాయి. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారు.
హీరో నిఖిల్ కి బాగా పరిచయం ఉన్న వ్యక్తి కరోనా వైరస్ తో మృతి చెందాడు. అతని వయస్సు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అదేవిధంగా కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఇకపోతే వృత్తిరీత్యానిఖిల్ భార్య పల్లవి డాక్టర్ కావడంతో ఇప్పటికే ఆమె రెండు డోస్ ల వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. తను కూడా త్వరలోనే వ్యాక్సిన్ వేయించుకోబోతున్నానని అందరూ కూడా.. వ్యాక్సిన్ వేయించుకొని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…