టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. హీరో రాజశేఖర్ కు పితృ వియోగం కలిగింది. హీరో రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ గత కొద్ది రోజుల నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే అతనిని మెరుగైన చికిత్స కోసం సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరదరాజన్ కన్నుమూశారు. వరదరాజన్ గోపాల్ వృత్తిపరంగా చెన్నై డిఎస్పీగా పదవి విరమణ పొందారు. ఈయనకు ఐదు మంది సంతానం కాగా వారిలో హీరో రాజశేఖర్ రెండో అబ్బాయి.ఇక హీరో రాజశేఖర్ తండ్రి మరణవార్త తెలిసిన పలువురు ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
శుక్రవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని చెన్నైకి తరలించినట్లు అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక వరదరాజన్ గోపాల్ అంత్యక్రియలు కూడా చెన్నైలోనే జరుగనున్నట్లు రాజశేఖర్ కుటుంబ సభ్యులు తెలియజేశారు. వరదరాజన్ గోపాల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు రాజశేఖర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
గతంలో రాజశేఖర్ తండ్రి డిఎస్పీగా విధులు నిర్వర్తించడం వల్ల ఆయన భౌతిక కాయానికి చెన్నై ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…